Shubman Gill: గిల్ ‘మాస్టర్ ప్లాన్’కి ఓకే చెప్పిన బీసీసీఐ.. శ్రీలంక సిరీస్కు ముందే అనూహ్య నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్లకు సిద్ధమయ్యే విధానంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. ప్రతి టెస్టు సిరీస్కు ముందు ఆటగాళ్లు రెడ్ బాల్ క్రికెట్కు సరైన రీతిలో సమాయత్తమయ్యేందుకు 15 రోజుల శిక్షణా క్యాంప్ను నిర్వహించాలని కెప్టెన్ శుభమన్ గిల్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి సూచించారు. గతంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన టెస్టు సిరీస్లలో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో, గిల్ ఇచ్చిన ఈ విలువైన సూచనను బిసిసిఐ సానుకూలంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సంబంధించి, సిరీస్ ప్రారంభానికి 18 రోజుల ముందే (జూలై 18న) బిసిసిఐ భారత జట్టును ప్రకటించడం ఈ మార్పునకు నిదర్శనం. అంతేకాకుండా, సిరీస్ ఆరంభానికి ముందే ఆగస్టు 7 నుంచి భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా పాల్గొననుంది.
ఈ ఆసక్తికర పరిణామంపై భారత జట్టు మాజీ బ్యాటర్ హనుమ విహారి తన యూట్యూబ్ ఛానెల్లో స్పందిస్తూ, సాధారణంగా టెస్టు సిరీస్లు ఐపిఎల్ లేదా ఇతర పరిమిత ఓవర్ల సిరీస్లు ముగిసిన వెంటనే జరుగుతుంటాయని, కానీ ఈసారి జట్టును ఇంత త్వరగా ప్రకటించడం అరుదైన విషయమని తెలిపారు. గిల్ సూచనల మేరకే బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుందని, ఇది జట్టు సన్నాహకానికి ఎంతో తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించే క్రమంలో భారత్కు ఈ సిరీస్ అత్యంత కీలకమైనదని, ఇక్కడి రెండు మ్యాచ్లలోనూ విజయం సాధిస్తే విన్ పర్సంటేజ్ గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లతో పాటు శ్రీలంక పర్యటన భారత్ ఫైనల్ అవకాశాలను నిర్దేశిస్తుందన్నారు.
Also Read
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీలంకలో పిచ్లు మందకొడిగా ఉంటూ, స్పిన్కు అనుకూలిస్తాయి కాబట్టి స్వదేశంలో ఆ జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదని విహారి హెచ్చరించారు. భారత బ్యాటర్లు సాధారణంగా స్వీప్ షాట్లు తక్కువగా ఆడుతారని, శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కోవడానికి వారు స్వీప్ షాట్లపై దృష్టి సారించి తగినంత ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ఈ సిరీస్ కోసం శుభమన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్ వంటి కీలక ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్తో అదిరిపోయే మోడల్స్!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!