Avinash Reddy: కడప జిల్లాలో మహానాడు అంటూ టీడీపీ పైశాచిక ఆనందం పొందుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా అన్ని స్థానాల్లో ఓటమి తప్పదని ఆయన జోష్యం చెప్పారు. పులివెందులలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాల చుట్టూ జెండాలు, తోరణాలు కట్టడంపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రాంతం ప్రజల ఎమోషన్ వైయస్సార్ అని, ఆయన విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యతా అంటూ ప్రశ్నించారు.
Read Also: IPL 2025:’ఆర్సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
తాము కక్ష సాధింపు రాజకీయం చేసి ఉండి ఉంటే.. మీ పరిస్థితి వేరేగా ఉండేదని, మాకు తగిలిన దెబ్బ మర్చిపోమన్నారని అన్నారు. దీనిపై పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి ఘాటుగా స్పందించారు. టీడీపీ తోరణాలు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజమైన వైయస్సార్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలి అన్నారు. వై ఎస్ విజయమ్మ పై కేసు నమోదు చేసింది ఎవరు? కార్యకర్త ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.
Read Also: TDP Mahanadu: అపోహలు చెదరగొట్టిన మహానాడు.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి..!
అలాగే షర్మిలకు రావలసిన ఆస్తిని రాకుండా చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి రాముడైతే లక్ష్మిడిలా పనిచేసిన వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని కాలర్ పట్టుకుని నిలదీయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇక మహానాడు కార్యక్రమంలో మూడు రోజులు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో కూడా తెలియకుండా కడప ఎంపీ విమర్శించడం విడ్డురంగా ఉందన్నారు.