Liquor Case: తాజాగా లిక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1 – కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు, ఏ31 – ధనుంజయ రెడ్డి, ఏ32 – కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 – గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఈ నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు, ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టనున్నారు.
Read Also: Rajat Patidar: సంబరాలు చేసుకుందాం, సిద్ధమా.. ఆర్సీబీ అభిమానులకు పాటీదార్ సందేశం!
ఎసిబి కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు (ఈరోజు, రేపు) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఈ విచారణ సిట్ కార్యాలయంలోనే జరుగుతుంది. ఈ రోజు ఉదయం విజయవాడ జైలు వద్ద నిందితులను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు, వైద్య పరీక్షల అనంతరం నేరుగా కస్టడీ విచారణకు తరలించారు. లిక్కర్ కేసులో నిందితులపై ఇప్పటికే పలు మలుపులు తిరిగిన నేపథ్యంలో, ఈ కస్టడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read Also: India China: పాక్ ప్రయోగించిన PL-15E క్షిపణిని కూల్చేసిన భారత్.. తొలిసారి స్పందించిన చైనా.