Siva Prasad Reddy: ఏడాది పాలనలో వెన్నుపోటు, మోసం, కుట్రలు తప్ప ఏం లేవు.. మాజీ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siva Prasad Reddy: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై విసుగుతో ఉన్నారని, మాటలతో మోసగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన ప్రజల సంఖ్యను చూసిన తర్వాత కూడా కొందరు టీడీపీ మహానాడు సమావేశంతో పోల్చడం హాస్యాస్పదం. మేము నిర్వహించిన సభకు జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. కానీ టీడీపీ మహానాడుకు మాత్రం బయటపెట్టి, బెదిరించి తరలించారు. ఇది ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించారు.
Read Also: IPL 2025:’ఆర్సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
Also Read
- RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, అనుష్క షాక్.. ఇలా కూడా చేస్తారా అంటూ అసహనం..
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అయినా అమలు చేసిందా అని నిలదీశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చాక ఏడాది దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ? ఏ పథకం అమలు చేశారు? చూపించగలరా? అని రాచమల్లు ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. మోసం, కుట్రలు, వెన్నుపోట్లతో పాలనను నడిపించారని ఆయన మండిపడ్డారు. విద్యుత్, RTC, నీటి బిల్లులతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Virat Kohli: నీళ్లు అందిస్తాడు అంటూ.. యువ ఆటగాడిపై విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్!
ప్రభుత్వం చేసిన అన్యాయాలను తెలిపేలా, ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినందుకు ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. మా పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇదే నిజమైన మద్దతు. స్వేచ్ఛగా వచ్చిన జనమే మా బలం అని ఆయన అన్నారు. ముఖ్యంగా, కడపను టీడీపీ గడ్డగా ప్రకటించడం హాస్యాస్పదమని విమర్శించారు. ఒక్కసారి మహానాడు నిర్వహించారన్న కారణంతో కడపను టీడీపీ అడ్డా అనడం వింతగా ఉంది. ప్రజల మద్దతుతోనే ఎవరు బలంగా ఉన్నారో త్వరలో అందరికీ తెలుస్తుంది అని అన్నారు.
తాజావార్తలు
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, అనుష్క షాక్.. ఇలా కూడా చేస్తారా అంటూ అసహనం..
-
Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!