Siva Prasad Reddy: ఏడాది పాలనలో వెన్నుపోటు, మోసం, కుట్రలు తప్ప ఏం లేవు.. మాజీ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siva Prasad Reddy: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై విసుగుతో ఉన్నారని, మాటలతో మోసగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన ప్రజల సంఖ్యను చూసిన తర్వాత కూడా కొందరు టీడీపీ మహానాడు సమావేశంతో పోల్చడం హాస్యాస్పదం. మేము నిర్వహించిన సభకు జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. కానీ టీడీపీ మహానాడుకు మాత్రం బయటపెట్టి, బెదిరించి తరలించారు. ఇది ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించారు.
Read Also: IPL 2025:’ఆర్సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
Also Read
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అయినా అమలు చేసిందా అని నిలదీశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చాక ఏడాది దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ? ఏ పథకం అమలు చేశారు? చూపించగలరా? అని రాచమల్లు ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. మోసం, కుట్రలు, వెన్నుపోట్లతో పాలనను నడిపించారని ఆయన మండిపడ్డారు. విద్యుత్, RTC, నీటి బిల్లులతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Virat Kohli: నీళ్లు అందిస్తాడు అంటూ.. యువ ఆటగాడిపై విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్!
ప్రభుత్వం చేసిన అన్యాయాలను తెలిపేలా, ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినందుకు ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. మా పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇదే నిజమైన మద్దతు. స్వేచ్ఛగా వచ్చిన జనమే మా బలం అని ఆయన అన్నారు. ముఖ్యంగా, కడపను టీడీపీ గడ్డగా ప్రకటించడం హాస్యాస్పదమని విమర్శించారు. ఒక్కసారి మహానాడు నిర్వహించారన్న కారణంతో కడపను టీడీపీ అడ్డా అనడం వింతగా ఉంది. ప్రజల మద్దతుతోనే ఎవరు బలంగా ఉన్నారో త్వరలో అందరికీ తెలుస్తుంది అని అన్నారు.
తాజావార్తలు
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
-
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!