Ramesh Nalam
Author- NTV Telugu-
జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లు
ఏపీలో ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడి’ అంటూ ఆదివారం విమర్శలు చేసిన పవన్.. సోమవారం కూడా ట్విట్టర్ వేదికగా వైసీసీని ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేశారు. కర్ణాటక మంగుళూరు ప్రాంతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి అందరికీ స్ఫూర్తిదాయకమని పవన్ ప్రశంసించారు. Read Also: డేవిడ్ వార్నర్పై […] -
డేవిడ్ వార్నర్పై హీరో మహేష్ బాబు ప్రశంసల జల్లు
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలుపులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర వహించాడు. 38 బంతుల్లో 53 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలుపు వైపు తీసుకువెళ్లాడు. దీంతో డేవిడ్ వార్నర్ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో మహేష్బాబు కూడా ఉన్నాడు. నిజానికి వార్నర్పై ఈ ప్రపంచకప్లో ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో అతడు రాణించలేదు. దీంతో సన్రైజర్స్ ఏకంగా జట్టు నుంచే వార్నర్ను తప్పించింది. ఈ పేలవ ప్రదర్శన […] -
అధికారంపై ఉన్న యావ అభివృద్ధిపై లేదు: ఈటల రాజేందర్
టీఆర్ఎస్ ప్రభుత్వంపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక లాంటి ఎన్నికలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నానని… ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు అన్నీ.. ఇన్నీ కాదని ఈటల ఆరోపించారు. రూ.వందల కోట్లను స్వయంగా పోలీసులే తీసుకొచ్చి పంచారని.. కమలాపూర్లో అయితే ఎల్లమ్మ దేవతపై ప్రమాణం చేయించి డబ్బులు పంచారని ఈటల విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో హుజురాబాద్ ప్రజలు అదే ఫలితాన్ని ఇచ్చారని సంతోషం […] -
బ్రేకింగ్: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైదరాబాద్లోని తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లోని సీఎస్ సోమేష్ కుమార్కు అందజేశారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది కలెక్టర్గా రిటైర్డ్ కానుండగా ఒక ఏడాది ముందే వెంకట్రామిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Read Also: రాములవారి కంట కన్నీరు… ఆందోళనలో […] -
పాత పంథాలోకి సమంత… ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్
నాగచైతన్యతో విడాకుల అనంతరం హీరోయిన్ సమంత జోరు పెంచుతోంది. పలు సినిమాలను అంగీకరించడమే కాకుండా మళ్లీ పాత పంథాలోకి వెళ్లి కమర్షియల్గా ఐటమ్ సాంగులకు సైతం ఓకే చెప్పేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఓ ఐటం సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసినట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. మంచి పాత్రలను మాత్రమే […] -
వామ్మో… ఈ మాస్క్ ధర అక్షరాలా 5 లక్షల 70 వేలు
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. దాంతో పలు కంపెనీలు పెద్ద ఎత్తున మాస్కులు తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం కేసులు తక్కువగా నమోదవుతుండగా ప్రజలు శానిటైజర్ వాడకం తగ్గించినా 90 శాతం మంది మాస్కులను మాత్రం ధరిస్తున్నారు. కొంతమంది మాస్క్ ధరించడంలో తమ సృజనాత్మకత, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో వజ్రాలు, బంగారు ఆభరణాలతో తయారుచేసిన మాస్కుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Read Also: తిరుమల శ్రీవారి […] -
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తుండగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో భక్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారని… వర్షాలు తగ్గడంతో నడకదారిలో అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఆయన తెలిపారు. […] -
తెలంగాణలో సంస్మరణ సభను నిర్వహించుకునే హక్కు కూడా లేదా?:
మావోయిస్ట్ పార్టీ ప్రముఖ నేత ఆర్కే భార్య శిరీష తెలంగాణ పోలీసులపై విమర్శలు చేశారు. ఆర్కేపై వచ్చిన కథనాలను, ఇంటర్వ్యూలను సేకరించి తాను బుక్ తయారుచేసి హైదరాబాద్లో ఆవిష్కరించాలని భావించానని…మీడియాలో వచ్చిన కథనాలను మాత్రమే పుస్తకంలో ప్రస్తావించానని, కానీ ఆ పుస్తకావిష్కరణను పోలీసులు అడ్డుకున్నారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలో ఎటువంటి విప్లవ సాహిత్యం లేదన్నారు. పుస్తక ఆవిష్కరణ కోసం డీజీపీ దగ్గర అర్జీ పెట్టుకున్నానని, ఆ తరువాత రోజే పుస్తకం ప్రింట్ చేస్తున్న […] -
రైతుల పాదయాత్రను టీడీపీ పాదయాత్రగా మార్చారు: వైసీపీ ఎమ్మెల్యే
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను టీడీపీ నేతలు పూర్తిగా తమ పాదయాత్రగా మార్చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్బాబు ఆరోపించారు. రైతుల పాదయాత్రను తమకు అనుకూలంగా మార్చుకుని పసుపుమయంగా చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలు పాల్గొనడమే దీనికి నిదర్శనమన్నారు. పోలీసులు రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదని.. కేవలం టీడీపీ శ్రేణులను మాత్రమే అడ్డుకున్నారని ఎమ్మెల్యే సుధాకర్బాబు స్పష్టం చేశారు. Read Also: శ్రీశైలం వెళ్లే పర్యాటకులకు గమనిక.. బోట్ సర్వీస్ […] -
ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి నెట్ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని అఖిల్ కెరీర్లో తొలి హిట్ మూవీ ఇదే. Read Also: ఎన్టీఆర్ షోలో రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ […]
తాజావార్తలు
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?