జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడి’ అంటూ ఆదివారం విమర్శలు చేసిన పవన్.. సోమవారం కూడా ట్విట్టర్ వేదికగా వైసీసీని ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేశారు. కర్ణాటక మంగుళూరు ప్రాంతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి అందరికీ స్ఫూర్తిదాయకమని పవన్ ప్రశంసించారు.
Read Also: డేవిడ్ వార్నర్పై హీరో మహేష్ బాబు ప్రశంసల జల్లు
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
హజబ్బ అనే పండ్ల వ్యాపారి తన సొంత డబ్బుతో స్కూల్ నిర్మించాడని.. ఇప్పుడు ఆయన వయసు 60 ఏళ్లు అని పవన్ తెలిపారు. అలాంటి వ్యక్తి దేశంలోనే నాలుగో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీ అవార్డు పొందారని పవన్ గుర్తుచేశారు. ఒక విదేశీయుడు నారింజ పండ్లు కిలో ఎంత అని ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్న అతడి స్ఫూర్తికరమైన జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పిందన్నారు. తనకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడంతో హజబ్బా తిరిగి సమాధానం చెప్పలేకపోయారని.. భవిష్యత్ తరాలు తనలా కాకూడదనే భయంతో ఆయన తన గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారని ట్వీట్లో పేర్కొన్నారు. పండ్ల అమ్మకాలతో పాటు ఇతరుల నుంచి సేకరించిన విరాళాలతో స్కూల్ను ఏర్పాటు చేశారని.. అలాంటి వ్యక్తి ఎంతో కష్టపడి స్కూల్ నిర్మిస్తే… ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం ఎయిడెడ్ స్కూళ్లనే మూసివేస్తుందని పవన్ ఎద్దేవా చేశారు.
నారింజ పండ్లు అమ్ముతూ పాఠశాల నిర్మించారు
పద్మ శ్రీ పురస్కారగ్రహీత హరేకల హజబ్బా స్ఫూర్తిదాయక ప్రస్థానం#HarekalaHajabba pic.twitter.com/LVrUgBLxk0
— JanaSena Party (@JanaSenaParty) November 15, 2021
తాజావార్తలు
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!