అధికారంపై ఉన్న యావ అభివృద్ధిపై లేదు: ఈటల రాజేందర్
టీఆర్ఎస్ ప్రభుత్వంపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక లాంటి ఎన్నికలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నానని… ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు అన్నీ.. ఇన్నీ కాదని ఈటల ఆరోపించారు. రూ.వందల కోట్లను స్వయంగా పోలీసులే తీసుకొచ్చి పంచారని.. కమలాపూర్లో అయితే ఎల్లమ్మ దేవతపై ప్రమాణం చేయించి డబ్బులు పంచారని ఈటల విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో హుజురాబాద్ ప్రజలు అదే ఫలితాన్ని ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో తాను ఔట్ సోర్సింగ్ ద్వారా 22 మందికి ఉద్యోగాలు కల్పిస్తే వారందరినీ తీసేశారని.. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న వాళ్లను మాత్రం ఉద్యోగాల్లో ఉంచారని ఈటల వ్యాఖ్యానించారు.
Read Also: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
టీఆర్ఎస్ పార్టీకి అధికారంపై ఉన్న యావ అభివృద్ధి, రైతులపై లేదని ఈటల ఆరోపించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని… కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకోమని.. రా రైస్ ఇవ్వాలని స్పష్టంగా సూచించారని ఈటల వివరించారు. తెలంగాణలో ఒక్క రైస్ క్లస్టర్ కూడా లేదని.. .దీని వల్ల రైతు క్వింటాల్కు రూ.140 వరకు నష్టపోతున్నారని తెలిపారు. సజ్జలు, రాగులు వంటి పంటలు పండించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగం ఉసురు పోసుకోకుండా ఉండాలంటే తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉందని ఈటెల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!