Ramesh Nalam
Author- NTV Telugu-
కేప్టౌన్ టెస్ట్: టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ను సఫారీ జట్టును 210 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియాకు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా జట్టులో పీటర్సన్ 72 పరుగులతో రాణించాడు. బవుమా 28, కేశవ్ మహారాజ్ 25, డస్సెన్ 21 పరుగులు చేశారు. Read Also: టీమిండియా వన్డే జట్టులో సైనీ, జయంత్ యాదవ్లకు చోటు భారత బౌలర్లలో బుమ్రాకు 5 వికెట్లు […] -
హైదరాబాద్లో దారుణం.. 13 ఏళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం గాదె వీరారెడ్డి (72) అనే వ్యక్తి… బర్కత్పురలోని గోకుల్ధామ్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017లో ఆమెను బడంగ్పేటలోని తన ఓపెన్ ప్లాట్కు వాచ్మెన్గా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరూ కలిసి […] -
ఇస్రోకు కొత్త సారథి… ఈనెల 14న బాధ్యతల స్వీకరణ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఛైర్మన్గా ఎస్.సోమనాథ్ నియామకం అయ్యారు. 2018 నుంచి విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్గా సోమనాథ్ విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 14తో ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పదవీ కాలం ముగియనుంది. అనంతరం సోమనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళకు చెందిన సోమనాథ్ దేశంలో టాప్ రాకెట్ సైంటిస్టుల్లో ఒకరిగా ఉన్నారు. ఉపగ్రహ వాహక నౌకల డిజైనింగ్లో సోమనాథ్ కీలక పాత్ర పోషించారు. కెరీర్ తొలినాళ్లలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ […] -
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. ఏం రాశారంటే..?
ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని లేఖలో కోరారు. ఆరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో హామీ ఇచ్చారని… ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతాంగం తీవ్ర నష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరగడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రైతు […] -
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. మహిళా పోలీస్ విభాగం ఏర్పాటు
ఏపీలో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీని ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం ఏపీ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మహిళా పోలీస్ విభాగంలో మొత్తం ఐదు కేటగిరీలుగా పోస్టులు ఉండనున్నాయి. మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ నాన్ గెజిటెడ్, మహిళా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, మహిళా పోలీసు ఏఏస్ఐ, […] -
టీమిండియా వన్డే జట్టులో సైనీ, జయంత్ యాదవ్లకు చోటు
దక్షిణాఫ్రికాతో తలపడే టీమిండియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. గతంలో ప్రకటించిన జట్టులో వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడి సిరీస్కు దూరం కాగా.. అతడి స్థానంలో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు స్థానం కల్పించారు. ఈ మేరకు బౌలర్లు జయంత్ యాదవ్, నవదీప్ సైనీలను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జనవరి 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 19న తొలి వన్డే, 21న రెండో వన్డే, […] -
అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనకు చుక్కెదురు
ఏపీ ప్రభుత్వం 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయగా…. ప్రజాభిప్రాయ సేకరణలో చుక్కెదురైంది. బుధవారం నాడు తుళ్లూరు మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. ఈ సందర్భంగా 16 గ్రామాలు అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఇప్పటికే ఈ విషయంపై పలుచోట్ల అధికారులు గ్రామ సభలు నిర్వహించగా ఈరోజు ఆఖరి గ్రామ సభను తుళ్లూరులో నిర్వహించారు. 2014లో సీఆర్డీఏ చట్టంలోని 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్కు తాము అనుకూలమని […] -
సామాన్యులకు మరో షాక్.. పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ ధరలు
ప్రముఖ కంపెనీ హిందూస్థాన్ యూనీలివర్ (HUL) సామాన్యులకు మరోసారి షాకిచ్చింది. గత ఏడాది నవంబరులోనే పలు ఉత్పత్తుల ధరలను పెంచిన హెచ్యూఎల్ తాజాగా మరోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాము ఉత్పత్తి చేస్తున్న సబ్బులు, డిటర్జెంట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్బాయ్ సబ్బుల ధరలను 3 నుంచి 20 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. తాజా ధరల ప్రకారం బట్టలు ఉతికేందుకు […] -
పండగ ప్రాముఖ్యతను వివరిస్తూ… సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను వివరించారు. మనదైన అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ఉన్న ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని సీఎం జగన్ అన్నారు. Read Also: పచ్చమందకు పైత్యం బాగా ముదిరింది: విజయసాయిరెడ్డి భోగి మంటలు, రంగ […] -
కమలం పార్టీకి షాక్… సైకిల్ ఎక్కిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
త్వరలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వలసలు జోరుగా సాగుతున్నాయి. నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఒక మంత్రి సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీలో చేరారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ గుర్తు సైకిల్ అని అందరికీ తెలిసిన విషయమే. అఖిలేష్ యాదవ్ ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అధికార పార్టీ నుంచి వలసలు పెరిగిపోవడంతో బీజేపీలో గుబులు మొదలైంది. Read […]
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?