-
ఏపీ పరిషత్ ఫైట్: కొనసాగుతున్న కౌంటింగ్.. ఇప్పటివరకు ఫలితాలు ఇవే
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. రాత్రి నాటికి పూర్తి జిల్లా పరిషత్ ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్లో కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని గిరిజా శంకర్ వెల్లడించారు. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎంపీటీసీ […] -
సీఎంను తిట్టిన రేవంత్ రెడ్డి పురుగులు పడి చస్తాడు: మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను తిట్టిన రేవంత్రెడ్డి.. లాఫుట్ గాడు, డొకవజీగాడు అని కూడా మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఏకంగా పురుగులు పడి చస్తాడంటూ శాపనార్థాలు కూడా పెట్టేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లిన వాడు సీఎంను తిడుతాడా అంటూ తీవ్రమైన పదజాలంతో మంత్రి మల్లారెడ్డి నిప్పులు చెరిగారు. టీపీసీసీ అధ్యక్ష పదవి 50 కోట్లతోని తెచ్చుకున్న రేవంత్ రెడ్డి […] -
సుమంత్ ‘అలోన్ పాట’ మహేష్ ప్లేలిస్ట్లో చేరింది
టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం విడాకులు తర్వాత జీవితం ఎలా ఉంటుంది?’ అనే కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. త్వరలోనే థియేటర్లోకి రానున్న నేపథ్యంలో తాజాగా లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘అలోన్ అలోన్’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ […] -
హనీమూన్లో హాస్య నటి
తెలుగు, తమిళ ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్న పాపులర్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ తన ప్రియుణ్ణి పెళ్లాడిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఫిట్నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ సంజయ్తో విద్యుల్లేఖా రామన్ ప్రేమలో ఉండగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో సెప్టెంబర్ 9న సంజయ్ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోలు మాత్రం బయటకి రాలేదు. రీసెంట్గా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవుల్లో వెళ్లారు. హనీమూన్ […] -
‘ప్రేమదేశం’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది!
టబు, వినీత్, అబ్బాస్ లు కలిసి నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా ‘ప్రేమదేశం’.. అప్పటివరకు రొటీన్ లవ్ స్టోరీ కథలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ సినిమా ప్రేమను, స్నేహాన్ని చూపించే కోణాన్నే మార్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే రాబోయే తరం ప్రేమ కథలను ఇరువై ఏళ్లకు ముందే ఈ చిత్రం చెప్పేసింది. తమిళంలో ‘కాదల్ దేశం’ చిత్రంగా రాగా తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో విడుదలై అక్కడి కంటే ఇక్కడ ఎక్కువ విజయవంతం అయింది. ఎ.ఆర్.రహమాన్ […] -
30 ఏళ్ళ ‘శాంతి-క్రాంతి’
(సెప్టెంబర్ 19న ‘శాంతి-క్రాంతి’కి 30 ఏళ్ళు) ప్రస్తుతం ఒకే కథను పలు భాషల్లో తెరకెక్కించి, సొమ్ము చేసుకోవాలని మన స్టార్ హీరోస్ తో చిత్రాలు నిర్మించేవారు ఆశిస్తున్నారు. ఆ పంథా కొత్తదేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల నుంచీ ఉంది. అయితే ఇప్పుడు ఆ విధానం మునుపటికంటే మాంచి ఊపు మీద ఉంది. కన్నడ నటదర్శకుడు వి.రవిచంద్రన్ 30 ఏళ్ళ క్రితమే ఈ పద్ధతిలో ‘శాంతి-క్రాంతి’ అనే చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ […] -
మరపురాని తాపీ ధర్మారావు రచనా మొరమరాలు!
(సెప్టెంబర్ 19న తాపీ ధర్మారావు జయంతి) చూడక నమ్మినవారు ధన్యులు అంటారు. కానీ, చూస్తేనే కదా అసలు విషయం తెలిసేదని వాదించేవారూ ఘనులే. హేతువును అన్వేషించడంలోనే ఆనందించేవారు ఇలాంటి ఘనులు. ఆ కోవకు చెందినవారు సుప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు. తెలుగునేలపై హేతువాదులుగా పేరొందిన రచయితల్లో ధర్మారావు స్థానం ప్రత్యేకమైనది. ఆయన ముక్కుసూటి తనం చాలామందికి నచ్చక పోవచ్చు. కానీ, ఆయన కలం బలం తెలిసినవారు మాత్రం ధర్మారావును అభిమానించకుండా ఉండలేరు. ప్రతీ విషయానికీ ఏదో ఒక […] -
35 ఏళ్ళ ‘కలియుగ కృష్ణుడు’
(సెప్టెంబర్ 19న ‘కలియుగ కృష్ణుడు’కు 35 ఏళ్ళు) నందమూరి బాలకృష్ణ నటనాపర్వంలో 1986వ సంవత్సరం మరపురానిది, ఆయన అభిమానులు మరచిపోలేనిది. ఆ సంవత్సరం బాలయ్య ఏడు చిత్రాలలో నటించగా, మొదటి సినిమా ‘నిప్పులాంటి మనిషి’ పరాజయం పాలయింది. ఆ తరువాత వచ్చిన ఆరు చిత్రాలూ వరుసగా ఘనవిజయం సాధించాయి. అలాంటి రికార్డు తెలుగు చిత్రసీమలో మరెవ్వరికీ లేదు. ఆ విజయపరంపరలో ఐదవ చిత్రంగా విడుదలయింది ‘కలియుగ కృష్ణుడు’. 1986 సెప్టెంబర్ 19న విడుదలైన ‘కలియుగ కృష్ణుడు’ చిత్రానికి […] -
ఆ ఇద్దరికి డ్రగ్స్ టెస్టు చేయించాలి.. ఖర్చులు నేనే భరిస్తా: రఘునందన్
మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కేటీఆర్, రేవంత్ రెడ్డిల భాష చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు వారిని గమనిస్తున్నారు. ఒక దైవ కార్యం కోసం అమిత్ షాని కలిస్తే రేవంత్ మాట్లాడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి నోరు ఆయనకు అనేక ఇబ్బందులు పెట్టింది. ఇటీవల కాంగ్రెస్ […] -
సైమా అవార్డ్స్ 2021: వేడుకలో టాలీవుడ్ తారల సందడి
(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) సైమా-2021 అవార్డ్స్ లో సౌత్ సినిమా సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్ డ్రెస్లలో స్టేజీపై హొయలు పోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపైన అవార్డ్స్ స్వీకరించారు. ఇక టాలీవుడ్ తారలు అవార్డ్స్ తో సందడి సందడి చేశారు. కరోనా కారణంగా గత ఏడాది సైమా అవార్డ్స్ […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!