ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. రాత్రి నాటికి పూర్తి జిల్లా పరిషత్ ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్లో కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని గిరిజా శంకర్ వెల్లడించారు.
మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు
వైసీపీ గెలిచిన స్థానాలు 3398, టీడీపీ గెలిచిన స్థానాలు 395, కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 3, బీజేపీ గెలిచిన స్థానాలు 14, జనసేన గెలిచిన స్థానాలు 17, ఇండిపెండెండ్ 80.. మొత్తం వెలువడిన ఫలితాలు 3923.
మధ్యాహ్నం నాలుగు గంట వరకు జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
వైసీపీ గెలిచిన స్థానాలు 142, టీడీపీ గెలిచిన స్థానాలు 2, కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 0, బీజేపీ గెలిచిన స్థానాలు 0, జనసేన గెలిచిన స్థానాలు 0.. మొత్తం వెలువడిన ఫలితాలు 144.