ఆ ఇద్దరికి డ్రగ్స్ టెస్టు చేయించాలి.. ఖర్చులు నేనే భరిస్తా: రఘునందన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కేటీఆర్, రేవంత్ రెడ్డిల భాష చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు వారిని గమనిస్తున్నారు. ఒక దైవ కార్యం కోసం అమిత్ షాని కలిస్తే రేవంత్ మాట్లాడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి నోరు ఆయనకు అనేక ఇబ్బందులు పెట్టింది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విషయంలో నోరూపారేసుకొని పార్టీకి వివరణ ఇచ్చుకోలేదా..? రేవంత్ రెడ్డి పదవి తెచ్చుకుందే సూటు కేసులతో అని కాంగ్రెస్ నేతలు చెప్పారు అది నిజం కాదా..? సోనియా రాజ్యం అంటే 14 వందల మంది బలి తీసుకొనే రాజ్యమా..? 2004లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తెలంగాణ ఇస్తే 14 వందల అమరవీరులు ప్రాణాలు దక్కేవికదా..? అంటూ రఘునందన్ విరుచుకుపడ్డారు.
గజ్వెల్ సభ టిఆర్ఎస్ సహకారంతో జరిగిందేమో.. అనుమానం కలుగుతోందన్నారు రఘునందన్. నిన్న మొన్నటి వరకు నర్సారెడ్డి టీఆరెస్ పార్టీ నుండి కాంగ్రెస్ కు రాలేదా..? కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కాంగ్రెస్ కు పంపించి గజ్వెల్ లో సభ పెట్టించారో అనిపిస్తుంది. నిర్మల్ బీజేపీ సభకు పోటీగా కేసీఆర్ సహకారంతో సీఎం నియోజకవర్గంలో సభ అని అనుమానం మాకు ఉంది. కాంగ్రెస్ నుండి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరలేదా..? టీఆర్ఎస్, కాంగ్రెస్ ది ఫెవికాల్ బంధం కాదా..? గతంలో టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ కాదా..? రేవంత్ రెడ్డి.. ముందు నీ మీటింగ్ లకు హాజరుకాని మీ సీనియర్ల సంగతి చూసుకో.. నీ పార్టీలో సమస్యలే పరిష్కరించుకోలేవు. ఎవరో వ్యక్తులు ప్రకటనలు ఇచుకుంటే బీజేపీ గిరిజనులను అవమానించింది అంటవా..? తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచనం దినోత్సవం అధికారిక నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. అవే డిమాండ్ లు నిర్మల్ సభలో అమిత్ షా చేస్తే మతవిద్వేషాలు రెచ్చగొట్టారని టీఆర్ఎస్ ఆరోపణలు చెస్తుంది. టీఆర్ఎస్ చేస్తే తప్పు లేదు గాని బీజేపీ చేస్తే తప్పు ఎలా అవుతుంది. పది జిల్లాలు పరిపాలించే మీరే రాజద్రోహం కేసులు పెడితే మేము దేశం అంత అధికారంలో ఉన్నాం మేము ఎన్ని కేసులు పెట్టాలి. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రేవంత్ రెడ్డి పీసీసీ పదవి వచ్చింది. హుజురాబాద్ ఎన్నికల్లో తేల్చుకుందాం రండి. రేవంత్ అన్న నాతో రా ఢీల్లికి.. అమిత్ షాను కలిసి కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేదాం. రేవంత్ రెడ్డికి చిత్తశుద్దిలేదు. రాజకీయకోసం ఆరోపణలు చేస్తున్నారు’ అని రఘునందన్ తెలిపారు.
Also Read
మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇద్దరికి డ్రగ్స్ టెస్టు చేయించాలన్నారు. ఇద్దరికి ఢీల్లిలో ఇండియా గేట్ వద్ద చేయిస్తే దేశ ప్రజలంతా చూస్తారు. డ్రగ్ పరీక్షలకు అయ్యే ఖర్చును నేనే భరిస్తా’ అంటూ ఎమ్మెల్యే రఘునందన్ హాట్ కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..