30 ఏళ్ళ ‘శాంతి-క్రాంతి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 19న ‘శాంతి-క్రాంతి’కి 30 ఏళ్ళు)
ప్రస్తుతం ఒకే కథను పలు భాషల్లో తెరకెక్కించి, సొమ్ము చేసుకోవాలని మన స్టార్ హీరోస్ తో చిత్రాలు నిర్మించేవారు ఆశిస్తున్నారు. ఆ పంథా కొత్తదేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల నుంచీ ఉంది. అయితే ఇప్పుడు ఆ విధానం మునుపటికంటే మాంచి ఊపు మీద ఉంది. కన్నడ నటదర్శకుడు వి.రవిచంద్రన్ 30 ఏళ్ళ క్రితమే ఈ పద్ధతిలో ‘శాంతి-క్రాంతి’ అనే చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందించారు. తెలుగులో నాగార్జున, తమిళ, హిందీ భాషల్లో రజనీకాంత్, కన్నడలో రవిచంద్రన్ ప్రధాన పాత్రను పోషించారు. కన్నడలో సైడ్ రోల్ ను రమేశ్ అరవిందన్ ధరించగా, మిగిలిని మూడు భాషల్లోనూ ఆ పాత్రలో రవిచంద్రన్ కనిపించారు. తమిళంలో ఈ చిత్రం పేరు ‘నాట్టుక్కు ఒరు నల్లవాన్’. చిత్రమేమిటంటే రజనీకాంత్ నటించిన తమిళ వర్షన్ తరువాత ‘పోలీస్ బుల్లెట్’ పేరుతో తెలుగులోకి అనువాదమయింది. 1991 సెప్టెంబర్ 19న తెలుగు, కన్నడ వర్షన్స్ విడుదలయ్యాయి. అదే యేడాది అక్టోబర్ 2న తమిళ వర్షన్ జనం ముందు నిలచింది.
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
పైకి పెద్దమనిషిలా కనిపిస్తూ మనుషుల అవయవాలను దొంగిలించి విదేశాలకు ఎగుమతి చేస్తుంటాడు డాడీ అనే వ్యక్తి. అతని ఆట కట్టించడానికి ఇన్ స్పెక్టర్ సుభాష్, అతని మిత్రుడు ఇన్ స్పెక్టర్ భరత్ పూనుకుంటారు. ఈ ఇద్దరు ఇన్ స్పెక్టర్స్ కు దేశభక్తి మెండుగా ఉంటుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటారు. డాడీ చేసే అకృత్యాలను వీరు ఎదుర్కొంటారు. చివరకు అతని అరాచక సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తారు. రవిచంద్రన్ కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వంలో నాలుగు భాషల్లోనూ ఈ కథ తెరకెక్కింది. తమ ఈశ్వరీ ప్రొడక్షన్స్ పతాకంపై రవిచంద్రన్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ చిత్రంలో జూహీ చావ్లా, ఖుష్బూ నాయికలు. అనంతనాగ్, సత్యనారాయణ, బాబు ఆంటోనీ, మానిక్ ఇరానీ, చారుహాసన్, శ్రీనాథ్, పి.జె.శర్మ, ఆహుతి ప్రసాద్, సాక్షి రంగారావు, అన్నపూర్ణ, బేబీ సంగీత నటించారు. ఈ చిత్రానికి హంసలేఖ సంగీతం ఎస్సెట్. ఇందులో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. వేటూరి కలం పలికించిన “స్వతంత్ర భారతమా…”, “అర్ధరాత్రిలో…”, “ఎవరు నీ సరి…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఎనిమిది పాటలను వేటూరి పలికించగా, “వచ్చాడు యమరాజా…” గీతాన్ని సిరివెన్నెల రాశారు. ‘శాంతి క్రాంతి’పై బోలెడు ఆశలతో రవిచంద్రన్ తెరకెక్కించారు. అంతకు ముందు రవిచంద్రన్, జూహీ చావ్లా నటించిన కన్నడ చిత్రం ‘ప్రేమలోక’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమలోకం’ పేరుతో అనువాదమై ఇక్కడా అలరించింది. అందువల్లే రవిచంద్రన్ తన ‘శాంతి-క్రాంతి’ కథను నాలుగు భాషల్లో రూపొందించారు. ఏ భాషలోనూ ఈ కథ జనాన్ని ఆకట్టుకోలేకపోయింది.
తాజావార్తలు
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?