30 ఏళ్ళ ‘శాంతి-క్రాంతి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 19న ‘శాంతి-క్రాంతి’కి 30 ఏళ్ళు)
ప్రస్తుతం ఒకే కథను పలు భాషల్లో తెరకెక్కించి, సొమ్ము చేసుకోవాలని మన స్టార్ హీరోస్ తో చిత్రాలు నిర్మించేవారు ఆశిస్తున్నారు. ఆ పంథా కొత్తదేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల నుంచీ ఉంది. అయితే ఇప్పుడు ఆ విధానం మునుపటికంటే మాంచి ఊపు మీద ఉంది. కన్నడ నటదర్శకుడు వి.రవిచంద్రన్ 30 ఏళ్ళ క్రితమే ఈ పద్ధతిలో ‘శాంతి-క్రాంతి’ అనే చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందించారు. తెలుగులో నాగార్జున, తమిళ, హిందీ భాషల్లో రజనీకాంత్, కన్నడలో రవిచంద్రన్ ప్రధాన పాత్రను పోషించారు. కన్నడలో సైడ్ రోల్ ను రమేశ్ అరవిందన్ ధరించగా, మిగిలిని మూడు భాషల్లోనూ ఆ పాత్రలో రవిచంద్రన్ కనిపించారు. తమిళంలో ఈ చిత్రం పేరు ‘నాట్టుక్కు ఒరు నల్లవాన్’. చిత్రమేమిటంటే రజనీకాంత్ నటించిన తమిళ వర్షన్ తరువాత ‘పోలీస్ బుల్లెట్’ పేరుతో తెలుగులోకి అనువాదమయింది. 1991 సెప్టెంబర్ 19న తెలుగు, కన్నడ వర్షన్స్ విడుదలయ్యాయి. అదే యేడాది అక్టోబర్ 2న తమిళ వర్షన్ జనం ముందు నిలచింది.
Also Read
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
- Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన 'రాజా శివాజీ'.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
పైకి పెద్దమనిషిలా కనిపిస్తూ మనుషుల అవయవాలను దొంగిలించి విదేశాలకు ఎగుమతి చేస్తుంటాడు డాడీ అనే వ్యక్తి. అతని ఆట కట్టించడానికి ఇన్ స్పెక్టర్ సుభాష్, అతని మిత్రుడు ఇన్ స్పెక్టర్ భరత్ పూనుకుంటారు. ఈ ఇద్దరు ఇన్ స్పెక్టర్స్ కు దేశభక్తి మెండుగా ఉంటుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటారు. డాడీ చేసే అకృత్యాలను వీరు ఎదుర్కొంటారు. చివరకు అతని అరాచక సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తారు. రవిచంద్రన్ కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వంలో నాలుగు భాషల్లోనూ ఈ కథ తెరకెక్కింది. తమ ఈశ్వరీ ప్రొడక్షన్స్ పతాకంపై రవిచంద్రన్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ చిత్రంలో జూహీ చావ్లా, ఖుష్బూ నాయికలు. అనంతనాగ్, సత్యనారాయణ, బాబు ఆంటోనీ, మానిక్ ఇరానీ, చారుహాసన్, శ్రీనాథ్, పి.జె.శర్మ, ఆహుతి ప్రసాద్, సాక్షి రంగారావు, అన్నపూర్ణ, బేబీ సంగీత నటించారు. ఈ చిత్రానికి హంసలేఖ సంగీతం ఎస్సెట్. ఇందులో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. వేటూరి కలం పలికించిన “స్వతంత్ర భారతమా…”, “అర్ధరాత్రిలో…”, “ఎవరు నీ సరి…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఎనిమిది పాటలను వేటూరి పలికించగా, “వచ్చాడు యమరాజా…” గీతాన్ని సిరివెన్నెల రాశారు. ‘శాంతి క్రాంతి’పై బోలెడు ఆశలతో రవిచంద్రన్ తెరకెక్కించారు. అంతకు ముందు రవిచంద్రన్, జూహీ చావ్లా నటించిన కన్నడ చిత్రం ‘ప్రేమలోక’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమలోకం’ పేరుతో అనువాదమై ఇక్కడా అలరించింది. అందువల్లే రవిచంద్రన్ తన ‘శాంతి-క్రాంతి’ కథను నాలుగు భాషల్లో రూపొందించారు. ఏ భాషలోనూ ఈ కథ జనాన్ని ఆకట్టుకోలేకపోయింది.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!