దేశంలో నంబర్-1 కారు మారుతి సుజుకీ ఫ్రాంక్స్ బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. 2025 మార్చి నెలలో కస్టమర్లు ఫ్రాంక్స్ కొనుగోలుపై రూ. 98,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం (Satellite) ఏర్పాటు చేసుకోనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన మొదటి రాష్ట్రంగా అస్సాం త్వరలో అవతరించబోతోంది.
గత గురువారం (మార్చి 6)న అమెరికాలోని చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది. అందుకు గల సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. ఎయిర్ ఇండియా తన దర్యాప్తులో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు వంటి వాటిని విమానం టాయిలెట్లలోకి నెట్టడం వల్ల టాయిలెట్లు మూసుకుపోయాయని.. అవి నిరుపయోగంగా మారాయని ఎయిర్ ఇండియా తెలిపింది.
కన్నుగీటి కుర్రకారును ఊపేసింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఫేమస్ అయినంత ఈజీగా కెరీర్ ను నిలబెట్టుకోలేకపోయింది. మలయాళ, తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. తెలుగులో చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఇది భారత్కు మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ విజయం తర్వాత భారత ఆటగాళ్ల పంట పండింది. వారికి భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. టీమిండియాలోని ప్రతి సభ్యుడికి కోటి రూపాయలకు పైగా ప్రైజ్ మనీ లభించింది.
ఛత్తీస్ఘడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని గోదర్మాన గ్రామంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాణసంచా పేలి ఐదుగురు చనిపోయారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ను ఐసీసీ (ICC) ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ఆరుగురికి చోటు దక్కింది. అయితే.. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఆశ్చర్యకరం.
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన కన్నడ సినీ నటి, డీజీపీ కుమార్తె రన్యా రావును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సోమవారం విచారణకు హాజరైన సమయంలో రన్యా కోర్టులోనే ఏడ్చింది. ఈ క్రమంలో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనను వేధిస్తున్నారని.. తిట్టారని రన్యా రావు న్యాయస్థానానికి తెలిపింది.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న నిరసనలో వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి.