Ranya Rao: డీఆర్ఐ అధికారులు నన్ను తిట్టారు.. వేధించారు
- రన్యా రావుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- సోమవారం విచారణకు హాజరైన రన్యా
- డీఆర్ఐ అధికారులు నన్ను వేధిస్తున్నారు.. తిట్టారు- రన్యా రావు.
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన కన్నడ సినీ నటి, డీజీపీ కుమార్తె రన్యా రావును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సోమవారం విచారణకు హాజరైన సమయంలో రన్యా కోర్టులోనే ఏడ్చింది. ఈ క్రమంలో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనను వేధిస్తున్నారని.. తిట్టారని రన్యా రావు న్యాయస్థానానికి తెలిపింది. అధికారులు తనను శారీరకంగా కాకుండా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంది. దీంతో.. తాను షాక్ కు గురయ్యానని, మానసికంగా చాలా బాధపడ్డానని రన్యా కోర్టుకు తెలిపింది. దుబాయ్ నుంచి ఇండియాకి రూ.14.56 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై వారం రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. కోర్టు ఆమెను మార్చి 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Read Also: Priyanka : నా కూతురిని ఒంటరిగా కారవాన్ లోకి రమ్మన్నాడుః హీరోయిన్ తల్లి
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
మరోవైపు.. బంగారు అక్రమ రవాణా కేసులో రన్యా ప్రమేయం ఉందని ఆరోపించడం కర్ణాటకలో పొలిటికల్ హీట్ను పెంచింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. రన్యాను కాపాడటంలో ప్రభావవంతమైన మంత్రి ప్రమేయం ఉందని బిజెపి ఆరోపించగా.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిఎంటి స్టీల్ బార్ ఫ్యాక్టరీని స్థాపించడానికి ఆమెకు 12 ఎకరాల భూమిని కేటాయించిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ ప్రోటోకాల్ను స్పష్టంగా ఉల్లంఘించడం వల్ల రన్యా రావు రూ. 14 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేయగలిగిందని.. ప్రభుత్వంలోని ప్రభావవంతమైన వ్యక్తుల ప్రత్యక్ష మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఆరోపించారు. ఈ కేసుపై రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర స్పందిస్తూ.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా జోక్యం చేసుకుంటే నిజం బయటపడుతుందని అన్నారు. “దర్యాప్తు పూర్తయ్యే వరకు, మేము ఏమీ చెప్పలేము” అని పేర్కొన్నారు.
Read Also: Satya Kumar Yadav: స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!