Ranya Rao: డీఆర్ఐ అధికారులు నన్ను తిట్టారు.. వేధించారు
- రన్యా రావుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- సోమవారం విచారణకు హాజరైన రన్యా
- డీఆర్ఐ అధికారులు నన్ను వేధిస్తున్నారు.. తిట్టారు- రన్యా రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన కన్నడ సినీ నటి, డీజీపీ కుమార్తె రన్యా రావును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సోమవారం విచారణకు హాజరైన సమయంలో రన్యా కోర్టులోనే ఏడ్చింది. ఈ క్రమంలో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనను వేధిస్తున్నారని.. తిట్టారని రన్యా రావు న్యాయస్థానానికి తెలిపింది. అధికారులు తనను శారీరకంగా కాకుండా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంది. దీంతో.. తాను షాక్ కు గురయ్యానని, మానసికంగా చాలా బాధపడ్డానని రన్యా కోర్టుకు తెలిపింది. దుబాయ్ నుంచి ఇండియాకి రూ.14.56 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై వారం రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. కోర్టు ఆమెను మార్చి 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Read Also: Priyanka : నా కూతురిని ఒంటరిగా కారవాన్ లోకి రమ్మన్నాడుః హీరోయిన్ తల్లి
Also Read
- Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
మరోవైపు.. బంగారు అక్రమ రవాణా కేసులో రన్యా ప్రమేయం ఉందని ఆరోపించడం కర్ణాటకలో పొలిటికల్ హీట్ను పెంచింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. రన్యాను కాపాడటంలో ప్రభావవంతమైన మంత్రి ప్రమేయం ఉందని బిజెపి ఆరోపించగా.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిఎంటి స్టీల్ బార్ ఫ్యాక్టరీని స్థాపించడానికి ఆమెకు 12 ఎకరాల భూమిని కేటాయించిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ ప్రోటోకాల్ను స్పష్టంగా ఉల్లంఘించడం వల్ల రన్యా రావు రూ. 14 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేయగలిగిందని.. ప్రభుత్వంలోని ప్రభావవంతమైన వ్యక్తుల ప్రత్యక్ష మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఆరోపించారు. ఈ కేసుపై రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర స్పందిస్తూ.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా జోక్యం చేసుకుంటే నిజం బయటపడుతుందని అన్నారు. “దర్యాప్తు పూర్తయ్యే వరకు, మేము ఏమీ చెప్పలేము” అని పేర్కొన్నారు.
Read Also: Satya Kumar Yadav: స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది..
తాజావార్తలు
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?