Ranya Rao: డీఆర్ఐ అధికారులు నన్ను తిట్టారు.. వేధించారు
- రన్యా రావుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- సోమవారం విచారణకు హాజరైన రన్యా
- డీఆర్ఐ అధికారులు నన్ను వేధిస్తున్నారు.. తిట్టారు- రన్యా రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన కన్నడ సినీ నటి, డీజీపీ కుమార్తె రన్యా రావును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సోమవారం విచారణకు హాజరైన సమయంలో రన్యా కోర్టులోనే ఏడ్చింది. ఈ క్రమంలో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనను వేధిస్తున్నారని.. తిట్టారని రన్యా రావు న్యాయస్థానానికి తెలిపింది. అధికారులు తనను శారీరకంగా కాకుండా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంది. దీంతో.. తాను షాక్ కు గురయ్యానని, మానసికంగా చాలా బాధపడ్డానని రన్యా కోర్టుకు తెలిపింది. దుబాయ్ నుంచి ఇండియాకి రూ.14.56 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై వారం రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. కోర్టు ఆమెను మార్చి 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Read Also: Priyanka : నా కూతురిని ఒంటరిగా కారవాన్ లోకి రమ్మన్నాడుః హీరోయిన్ తల్లి
Also Read
- Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
మరోవైపు.. బంగారు అక్రమ రవాణా కేసులో రన్యా ప్రమేయం ఉందని ఆరోపించడం కర్ణాటకలో పొలిటికల్ హీట్ను పెంచింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. రన్యాను కాపాడటంలో ప్రభావవంతమైన మంత్రి ప్రమేయం ఉందని బిజెపి ఆరోపించగా.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిఎంటి స్టీల్ బార్ ఫ్యాక్టరీని స్థాపించడానికి ఆమెకు 12 ఎకరాల భూమిని కేటాయించిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ ప్రోటోకాల్ను స్పష్టంగా ఉల్లంఘించడం వల్ల రన్యా రావు రూ. 14 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేయగలిగిందని.. ప్రభుత్వంలోని ప్రభావవంతమైన వ్యక్తుల ప్రత్యక్ష మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఆరోపించారు. ఈ కేసుపై రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర స్పందిస్తూ.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా జోక్యం చేసుకుంటే నిజం బయటపడుతుందని అన్నారు. “దర్యాప్తు పూర్తయ్యే వరకు, మేము ఏమీ చెప్పలేము” అని పేర్కొన్నారు.
Read Also: Satya Kumar Yadav: స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది..
తాజావార్తలు
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..