Ranya Rao: డీఆర్ఐ అధికారులు నన్ను తిట్టారు.. వేధించారు
- రన్యా రావుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- సోమవారం విచారణకు హాజరైన రన్యా
- డీఆర్ఐ అధికారులు నన్ను వేధిస్తున్నారు.. తిట్టారు- రన్యా రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన కన్నడ సినీ నటి, డీజీపీ కుమార్తె రన్యా రావును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సోమవారం విచారణకు హాజరైన సమయంలో రన్యా కోర్టులోనే ఏడ్చింది. ఈ క్రమంలో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనను వేధిస్తున్నారని.. తిట్టారని రన్యా రావు న్యాయస్థానానికి తెలిపింది. అధికారులు తనను శారీరకంగా కాకుండా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంది. దీంతో.. తాను షాక్ కు గురయ్యానని, మానసికంగా చాలా బాధపడ్డానని రన్యా కోర్టుకు తెలిపింది. దుబాయ్ నుంచి ఇండియాకి రూ.14.56 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై వారం రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. కోర్టు ఆమెను మార్చి 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Read Also: Priyanka : నా కూతురిని ఒంటరిగా కారవాన్ లోకి రమ్మన్నాడుః హీరోయిన్ తల్లి
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
మరోవైపు.. బంగారు అక్రమ రవాణా కేసులో రన్యా ప్రమేయం ఉందని ఆరోపించడం కర్ణాటకలో పొలిటికల్ హీట్ను పెంచింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. రన్యాను కాపాడటంలో ప్రభావవంతమైన మంత్రి ప్రమేయం ఉందని బిజెపి ఆరోపించగా.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిఎంటి స్టీల్ బార్ ఫ్యాక్టరీని స్థాపించడానికి ఆమెకు 12 ఎకరాల భూమిని కేటాయించిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ ప్రోటోకాల్ను స్పష్టంగా ఉల్లంఘించడం వల్ల రన్యా రావు రూ. 14 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేయగలిగిందని.. ప్రభుత్వంలోని ప్రభావవంతమైన వ్యక్తుల ప్రత్యక్ష మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఆరోపించారు. ఈ కేసుపై రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర స్పందిస్తూ.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా జోక్యం చేసుకుంటే నిజం బయటపడుతుందని అన్నారు. “దర్యాప్తు పూర్తయ్యే వరకు, మేము ఏమీ చెప్పలేము” అని పేర్కొన్నారు.
Read Also: Satya Kumar Yadav: స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది..
తాజావార్తలు
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!