Ranya Rao: డీఆర్ఐ అధికారులు నన్ను తిట్టారు.. వేధించారు
- రన్యా రావుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- సోమవారం విచారణకు హాజరైన రన్యా
- డీఆర్ఐ అధికారులు నన్ను వేధిస్తున్నారు.. తిట్టారు- రన్యా రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన కన్నడ సినీ నటి, డీజీపీ కుమార్తె రన్యా రావును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సోమవారం విచారణకు హాజరైన సమయంలో రన్యా కోర్టులోనే ఏడ్చింది. ఈ క్రమంలో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనను వేధిస్తున్నారని.. తిట్టారని రన్యా రావు న్యాయస్థానానికి తెలిపింది. అధికారులు తనను శారీరకంగా కాకుండా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంది. దీంతో.. తాను షాక్ కు గురయ్యానని, మానసికంగా చాలా బాధపడ్డానని రన్యా కోర్టుకు తెలిపింది. దుబాయ్ నుంచి ఇండియాకి రూ.14.56 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై వారం రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. కోర్టు ఆమెను మార్చి 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Read Also: Priyanka : నా కూతురిని ఒంటరిగా కారవాన్ లోకి రమ్మన్నాడుః హీరోయిన్ తల్లి
Also Read
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
మరోవైపు.. బంగారు అక్రమ రవాణా కేసులో రన్యా ప్రమేయం ఉందని ఆరోపించడం కర్ణాటకలో పొలిటికల్ హీట్ను పెంచింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. రన్యాను కాపాడటంలో ప్రభావవంతమైన మంత్రి ప్రమేయం ఉందని బిజెపి ఆరోపించగా.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిఎంటి స్టీల్ బార్ ఫ్యాక్టరీని స్థాపించడానికి ఆమెకు 12 ఎకరాల భూమిని కేటాయించిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ ప్రోటోకాల్ను స్పష్టంగా ఉల్లంఘించడం వల్ల రన్యా రావు రూ. 14 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేయగలిగిందని.. ప్రభుత్వంలోని ప్రభావవంతమైన వ్యక్తుల ప్రత్యక్ష మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఆరోపించారు. ఈ కేసుపై రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర స్పందిస్తూ.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా జోక్యం చేసుకుంటే నిజం బయటపడుతుందని అన్నారు. “దర్యాప్తు పూర్తయ్యే వరకు, మేము ఏమీ చెప్పలేము” అని పేర్కొన్నారు.
Read Also: Satya Kumar Yadav: స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది..
తాజావార్తలు
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..