Tragedy: బాణసంచా పేలుడు.. ఊపిరాడక ఐదుగురు మృతి
- ఛత్తీస్ఘడ్లో తీవ్ర విషాదం
- బాణసంచా పేలి ఐదుగురు మృతి
- ఊపిరాడక కుటుంబ సభ్యులు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్ఘడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని గోదర్మాన గ్రామంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాణసంచా పేలి ఐదుగురు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. హోలీ పండగ కోసమని పటాకులు అమ్మేందుకు కిరాణ వ్యాపారి కుష్ గుప్తా (45) సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో భారీగా పటాకులు అమ్మకానికి తీసుకురాగా.. వాటిని కిరాణం షాపు బయట ఎండలో పెట్టాడు. అయితే ఎండ వేడికి పటాకులు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో.. ఆ ప్రాంతమంతా భారీగా పొగలతో కమ్ముకుపోయింది. అంతేకాకుండా.. పేలుడు శబ్దం భారీగా రావడంతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
Read Also: ICC: ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో రోహిత్కు దక్కని చోటు.. ఫ్యాన్స్ ఫైర్
Also Read
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
కాగా.. పొగ భారీగా కమ్ముకోవడంతో కుష్ గుప్తా తన కిరాణా దుకాణంలోకి వెళ్లాడు. ఆ తర్వాత.. అతని భార్య, పిల్లలు వెళ్లారు. అయితే పొగ వస్తుందని షాపు షట్టర్ను కిందకు దించాడు. ఈ క్రమంలో.. పొగ, గ్యాస్ షాపులోకి ప్రవేశించి ఊపిరాడక చేసింది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు వెనుక గోడ భాగాన్ని కట్ చేశారు. అనంతరం పోలీసులు లోపలికి చేరుకునేసరికి కుటుంబమంతా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
Read Also: Botsa Satyanarayana: ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి..
ఈ క్రమంలో వెంటనే ఐదుగురినీ రామానుజ్గంజ్లోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ అందరూ చనిపోయారని వైద్యులు ప్రకటించారు. ఊపిరాడకపోవడం వల్లే మరించారని డాక్టర్లు నిర్ధారించారు. మృతుల్లో ఒక చిన్నారి, మహిళ కూడా ఉన్నారు. అనంతరం పోస్ట్మార్టం చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
-
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
-
Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!