Tragedy: బాణసంచా పేలుడు.. ఊపిరాడక ఐదుగురు మృతి
- ఛత్తీస్ఘడ్లో తీవ్ర విషాదం
- బాణసంచా పేలి ఐదుగురు మృతి
- ఊపిరాడక కుటుంబ సభ్యులు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్ఘడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని గోదర్మాన గ్రామంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాణసంచా పేలి ఐదుగురు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. హోలీ పండగ కోసమని పటాకులు అమ్మేందుకు కిరాణ వ్యాపారి కుష్ గుప్తా (45) సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో భారీగా పటాకులు అమ్మకానికి తీసుకురాగా.. వాటిని కిరాణం షాపు బయట ఎండలో పెట్టాడు. అయితే ఎండ వేడికి పటాకులు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో.. ఆ ప్రాంతమంతా భారీగా పొగలతో కమ్ముకుపోయింది. అంతేకాకుండా.. పేలుడు శబ్దం భారీగా రావడంతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
Read Also: ICC: ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో రోహిత్కు దక్కని చోటు.. ఫ్యాన్స్ ఫైర్
Also Read
- Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
- Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
కాగా.. పొగ భారీగా కమ్ముకోవడంతో కుష్ గుప్తా తన కిరాణా దుకాణంలోకి వెళ్లాడు. ఆ తర్వాత.. అతని భార్య, పిల్లలు వెళ్లారు. అయితే పొగ వస్తుందని షాపు షట్టర్ను కిందకు దించాడు. ఈ క్రమంలో.. పొగ, గ్యాస్ షాపులోకి ప్రవేశించి ఊపిరాడక చేసింది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు వెనుక గోడ భాగాన్ని కట్ చేశారు. అనంతరం పోలీసులు లోపలికి చేరుకునేసరికి కుటుంబమంతా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
Read Also: Botsa Satyanarayana: ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి..
ఈ క్రమంలో వెంటనే ఐదుగురినీ రామానుజ్గంజ్లోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ అందరూ చనిపోయారని వైద్యులు ప్రకటించారు. ఊపిరాడకపోవడం వల్లే మరించారని డాక్టర్లు నిర్ధారించారు. మృతుల్లో ఒక చిన్నారి, మహిళ కూడా ఉన్నారు. అనంతరం పోస్ట్మార్టం చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్
-
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
-
Nithin: నితిన్తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..