Satellite: ఈ రాష్ట్రానికి సొంత శాటిలైట్.. దేశంలో తొలిసారి..!
- దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం
- 2025-26 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటన
- సొంతగా ఉపగ్రహం ఉంటే విదేశీయుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవచ్చు- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం (Satellite) ఏర్పాటు చేసుకోనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన మొదటి రాష్ట్రంగా అస్సాం త్వరలో అవతరించబోతోంది. ఈ ఉపగ్రహం ముఖ్యంగా సామాజిక-ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు అవసరమైన డేటాను సేకరించడంలో.. అలాగే సరిహద్దు నిఘాకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. 2025-26 రాష్ట్ర బడ్జెట్ను సమర్పిస్తూ అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ఈ ప్రకటన చేశారు.
Read Also: Priya Prakash : నాకు మూవీ ఛాన్సులు ఇవ్వట్లేదు.. ఆ పని చేసుకుంటున్నా..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
“కీలకమైన సామాజిక-ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు నిరంతర డేటా ప్రవాహం కోసం.. భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం, IN-SPACe (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్)తో సహకారంతో, సొంత ఉపగ్రహం ‘అసంసత్’ ను ఏర్పాటు చేయాలని మేము ప్రణాళిక వేసుకున్నాము. కీలకమైన ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇదెంతో దోహదం చేస్తుంది’’ అని ఆర్థికమంత్రి అజంతా నియాగ్ వెల్లడించారు.
Read Also: Champions Trophy 2025: ప్రైజ్మనీ రివీల్ చేసిన ఐసీసీ.. భారత్కు ఎంతంటే..?
ఈ అంశంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. “మనకు మన సొంత ఉపగ్రహం ఉంటే, అది విదేశీయులు అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తారా లేదా అని చెబుతుంది. ఇది రాబోయే వరదల గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వగలదు. అలాగే వాతావరణ నివేదికలు కూడా అందించగలదు. ఇది రైతులకు ప్రయోజనకరంగా మారుతుంది,” అని తెలిపారు. దీని ఏర్పాటు కోసం ఇస్రోతో చర్చలు మొదలుపెట్టామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!