Air india Statement: ఎయిరిండియా ఫ్లైట్ టాయిలెట్లో పాలిథిన్ బ్యాగులు, గుడ్డలు..
- చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
- గత గురువారం ఘటన
- తిరిగి చికాగో విమానాశ్రయంలో ల్యాండింగ్
- సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ
- విమానం టాయిలెట్లలో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత గురువారం (మార్చి 6)న అమెరికాలోని చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది. అందుకు గల సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. ఎయిర్ ఇండియా తన దర్యాప్తులో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు వంటి వాటిని విమానం టాయిలెట్లలోకి నెట్టడం వల్ల టాయిలెట్లు మూసుకుపోయాయని.. అవి నిరుపయోగంగా మారాయని ఎయిర్ ఇండియా తెలిపింది. దీంతో.. చికాగో నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం A-126 అమెరికన్ నగరంలో తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.
Read Also: Champions Trophy 2025: ప్రైజ్మనీ రివీల్ చేసిన ఐసీసీ.. భారత్కు ఎంతంటే..?
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా మాట్లాడుతూ.. విమానం బయలుదేరిన దాదాపు గంటా నలభై ఐదు నిమిషాల తర్వాత బిజినెస్, ఎకానమీ క్లాసులలోని కొన్ని టాయిలెట్లు నిండిపోయాయని సిబ్బంది నివేదించారని చెప్పారు. తదనంతరం విమానంలోని 12 టాయిలెట్లలో ఎనిమిది నిరుపయోగంగా మారాయి.. దీనివల్ల విమానంలో ఉన్న ప్రయాణీకులందరికీ అసౌకర్యం కలిగిందని ప్రకటనలో తెలిపింది.
Read Also: The Paradise: నాని సినిమాలో పీపుల్ స్టార్.. నిజమేనా..?
విమానంలో సమస్య ఉందని సిబ్బందికి తెలియగానే.. విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుంది. అంటే అది అప్పటికే యూరప్లోని ఏదో ఒక ప్రదేశం మీదుగా వెళ్లి విమానం ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే.. చాలా యూరోపియన్ విమానాశ్రయాలలో రాత్రి కార్యకలాపాలపై ఆంక్షలు ఉన్నందున ఆ విమానాన్ని తిరిగి చికాగోకు తీసుకువచ్చారు. ప్రయాణీకుల సౌలభ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ రోజు విమానాన్ని తిరిగి చికాగోకు తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. చికాగో నుండి న్యూఢిల్లీకి వెళ్లే విమానం నంబర్ AI126లో ఉపయోగించలేని టాయిలెట్లకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పోస్ట్లు వచ్చాయి. దీని కారణంగా విమానాన్ని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి మళ్లించాల్సి వచ్చింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నప్పుడు.. తమ బృందాలు పాలిథిన్ బ్యాగులు, గుడ్డలు, బట్టలు ఫ్లష్ చేయబడి ప్లంబింగ్లో చిక్కుకున్నాయని కనుగొన్నాయని మేము నిర్ధారించాలనుకుంటున్నాము” అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!