తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ విద్యార్థులు గాంధీ ఆసుపత్రి ముట్టడించేందుకు యత్నించారు. బోయగూడలోని నర్సింగ్ కళాశాల, హాస్టల్లో డ్రైనేజీ సమస్య మూలంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో మురుగు వ్యవస్థ అద్వాన్నంగా తయారై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు.
బెంగళూరులో హైడ్రా బృందం పర్యటిస్తుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా పర్యటన కొనసాగనుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు CSR కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా బృందం స్టడీ చేయనుంది.
శిఖర్ ధావన్ మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా..? ధావన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే.. వైరల్ అవుతున్న వీడియో చూస్తే అదే సందేహం కలుగుతుంది. శిఖర్ ధావన్ ఓ కొత్త అమ్మాయితో కనిపించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియనప్పటికీ.. తనతో పాటు ఆమె విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ధావన్తో ఆమెకు ఉన్న అనుబంధం గురించి ఇంకా క్లారిటీ లేదు.
పెరూలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలాకాలో రెండు దేశీయ క్లబ్లు జువెటాడ్ బెల్లావిస్టా-ఫామిలియా చోకా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం జరుగుతుండగా, భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో.. రిఫరీ ఆటను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా.. పిడుగు పడింది.
ప్రతి అందరి ఇళ్ల కిచెన్లో బంగాళదుంపలు (ఆలుగడ్డ) ఖచ్చితంగా ఉంటాయి. బంగాళదుంప కర్రీ నుంచి మొదలు పెడితే.. సాంబారు, పులుసు ఇలా దీనిని వాడేస్తారు. బంగాళాదుంప కర్రీ అంటే కొంత మందికి ఇష్టముంటుంది.. కొంత మందికి ఉండదు. ఏదేమైనాప్పటికీ.. బంగాళదుంపలు ఆహార పదార్థాలలో ఒకటి. అయితే కొన్నిసార్లు బంగాళాదుంపలపై మొలకలు వస్తాయి. అయితే ఈ మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల మన ఆరోగ్యంపై చాలా ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా.
న్యూజిలాండ్పై భారత్ ఓటమి పాలైనప్పటి నుంచి టీమిండియాను అందరూ టార్గెట్ చేస్తున్నారు. సూటి పోటీ మాటలతో తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. తాజాగా.. పాకిస్థాన్కు చెందిన మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టు కూడా భారత్ను ఓడించగలదని అన్నాడు. ఈరోజు పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది.
హ్యుందాయ్ వెర్నా రెండు కొత్త ఫీచర్లతో ముందుకొస్తుంది. ఈ కారు వెనుక స్పాయిలర్తో వస్తుంది. అంతేకాకుండా.. కొత్త గ్రే మోనోటోన్ కలర్ ఆప్షన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అలాగే.. హ్యుందాయ్ వెర్నా భారతీయ కస్టమర్ల కోసం మొత్తం 8 మోనోటోన్ షేడ్స్లో అందుబాటులో ఉంటుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కోట్లను కొల్లగొట్టనున్నాడు. ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ లేడు. డబ్బుల విషయంలో ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని, పంత్ మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదని.. ఈ క్రమంలోనే పంత్ను ఢిల్లీ విడుదల చేసిందని చెబుతున్నారు. దీంతో.. వచ్చే సీజన్లో పంత్ కొత్త జట్టుకు ఆడబోతున్నాడు.. అతను ఏ జట్టుకు ఆడుతాడన్నది మెగా వేలంలో డిసైడ్ కానుంది.
మీరు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన ఫోన్ కొనాలంటే ఇదో సువర్ణావకాశం. ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ నడుస్తోంది. మోటరోలా జీ 45 (Motorola G45 5G)ని 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.11,999 ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ లేదా IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI లావాదేవీ చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.