Teamindia: భారత్ను పాకిస్థాన్ ఓడించగలదు.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
- న్యూజిలాండ్పై భారత్ ఓటమి పాలైనప్పటి నుంచి టార్గెట్
- సూటి పోటీ మాటలతో తీవ్ర వ్యాఖ్యలు
- పాకిస్థాన్కు చెందిన మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు
- పాకిస్తాన్ జట్టు కూడా భారత్ను ఓడించగలదు- వసీం అక్రమ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్పై భారత్ ఓటమి పాలైనప్పటి నుంచి టీమిండియాను అందరూ టార్గెట్ చేస్తున్నారు. సూటి పోటీ మాటలతో తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. తాజాగా.. పాకిస్థాన్కు చెందిన మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టు కూడా భారత్ను ఓడించగలదని అన్నాడు. ఈరోజు పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంగ్లండ్కు చెందిన మైఖేల్ వాన్, పాకిస్తాన్కు చెందిన వసీం అక్రమ్ కామెంటరీ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ్ను వాన్ ఓ ప్రశ్న అడుగుతూ, “నేను భారత్-పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ని చూడాలనుకుంటున్నాను” అని అన్నాడు.
Read Also: SDT 18: ధరమ్ తేజ్ సినిమాలో జగపతిబాబు.. భయపెడుతున్నాడే!
Also Read
- Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
దీంతో అక్రమ్ ప్రశ్నకు సమాధానం చెబుతూ, “ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. క్రికెట్ అంటే రెండు దేశాలకు పిచ్చి” అని అన్నాడు. ఆ తర్వాత.. వాన్ మాట్లాడుతూ, “ఇప్పుడు పాకిస్థాన్ టర్నింగ్ పిచ్లపై భారత్ను ఓడించగలదు” అని అన్నాడు. దీనికి అక్రమ్ స్పందిస్తూ.. “స్పిన్నింగ్ ట్రాక్పై టెస్టు క్రికెట్లో భారత్ను ఓడించే అవకాశం ఇప్పుడు పాకిస్తాన్కు ఉంది”. అని తెలిపాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు గురించి వసీం అక్రమ్ గొప్పగా చెప్పాడు. ఇటీవలే టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టును పాకిస్తాన్ ఓడించిన సంగతి తెలిసిందే..
Read Also: Gujarat: గుజరాత్లో ఘోర విషాదం.. కారులో ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి
గత 24 ఏళ్లలో తొలిసారిగా స్వదేశంలో భారత జట్టు క్లీన్స్వీప్ను ఎదుర్కొంది. స్పిన్నర్లకు భారత బ్యాట్స్మెన్లు తట్టుకోకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణం. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాట్స్మెన్లు సత్తా చాటలేకపోయారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ భారత టాప్ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టారు. మరోవైపు.. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చాలా కాలం తర్వాత స్వదేశంలో పాక్ స్పిన్నర్లు అదరగొట్టారు. దీంతో.. పాక్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే.. స్పిన్నింగ్ వికెట్లపై టీమిండియాను తమ జట్టు ఓడించగలదని వసీం అక్రమ్ అన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య – గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
-
Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
-
Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!