Teamindia: భారత్ను పాకిస్థాన్ ఓడించగలదు.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
- న్యూజిలాండ్పై భారత్ ఓటమి పాలైనప్పటి నుంచి టార్గెట్
- సూటి పోటీ మాటలతో తీవ్ర వ్యాఖ్యలు
- పాకిస్థాన్కు చెందిన మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు
- పాకిస్తాన్ జట్టు కూడా భారత్ను ఓడించగలదు- వసీం అక్రమ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్పై భారత్ ఓటమి పాలైనప్పటి నుంచి టీమిండియాను అందరూ టార్గెట్ చేస్తున్నారు. సూటి పోటీ మాటలతో తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. తాజాగా.. పాకిస్థాన్కు చెందిన మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టు కూడా భారత్ను ఓడించగలదని అన్నాడు. ఈరోజు పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంగ్లండ్కు చెందిన మైఖేల్ వాన్, పాకిస్తాన్కు చెందిన వసీం అక్రమ్ కామెంటరీ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ్ను వాన్ ఓ ప్రశ్న అడుగుతూ, “నేను భారత్-పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ని చూడాలనుకుంటున్నాను” అని అన్నాడు.
Read Also: SDT 18: ధరమ్ తేజ్ సినిమాలో జగపతిబాబు.. భయపెడుతున్నాడే!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
దీంతో అక్రమ్ ప్రశ్నకు సమాధానం చెబుతూ, “ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. క్రికెట్ అంటే రెండు దేశాలకు పిచ్చి” అని అన్నాడు. ఆ తర్వాత.. వాన్ మాట్లాడుతూ, “ఇప్పుడు పాకిస్థాన్ టర్నింగ్ పిచ్లపై భారత్ను ఓడించగలదు” అని అన్నాడు. దీనికి అక్రమ్ స్పందిస్తూ.. “స్పిన్నింగ్ ట్రాక్పై టెస్టు క్రికెట్లో భారత్ను ఓడించే అవకాశం ఇప్పుడు పాకిస్తాన్కు ఉంది”. అని తెలిపాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు గురించి వసీం అక్రమ్ గొప్పగా చెప్పాడు. ఇటీవలే టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టును పాకిస్తాన్ ఓడించిన సంగతి తెలిసిందే..
Read Also: Gujarat: గుజరాత్లో ఘోర విషాదం.. కారులో ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి
గత 24 ఏళ్లలో తొలిసారిగా స్వదేశంలో భారత జట్టు క్లీన్స్వీప్ను ఎదుర్కొంది. స్పిన్నర్లకు భారత బ్యాట్స్మెన్లు తట్టుకోకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణం. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాట్స్మెన్లు సత్తా చాటలేకపోయారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ భారత టాప్ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టారు. మరోవైపు.. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చాలా కాలం తర్వాత స్వదేశంలో పాక్ స్పిన్నర్లు అదరగొట్టారు. దీంతో.. పాక్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే.. స్పిన్నింగ్ వికెట్లపై టీమిండియాను తమ జట్టు ఓడించగలదని వసీం అక్రమ్ అన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!