DK Aruna: ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ సర్వే..
- సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు
- ఈ సర్వే ద్వారా కుల.. జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది- డీకే అరుణ
- కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉంది- డీకే అరుణ
- ఆస్తులు.. అప్పులు.. భూములు.. ఏ పార్టీ అని అడుగుతున్నారు- డీకే అరుణ
- వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకు- డీకే అరుణ
- ఈ సర్వే దేని కోసమో స్పష్టం చేయాలి- డీకే అరుణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. ఈ సర్వే దేనికోసమో స్పష్టం చేయాలి.. బీసీ వర్గాలను మోసం చేయడానికే ఈ సర్వే అని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ సర్వే అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం సమంజసమా.. ఎన్నికల్లో ప్రజలను మోసం అధికారంలోకి వచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Read Also: HYDRA: బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన.. పలు ప్రాజెక్టులపై స్టడీ
Also Read
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే.. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. లక్షన్నర కోట్ల దోపిడీకి మాత్రమే బీజేపీ వ్యతిరేకమని డీకే అరుణ అన్నారు. డ్రైనేజీ వెళ్లకుండా ముందు మూసీ చుట్టూ రీటైనింగ్ వాల్ కట్టండి.. కుల జన గణన పేరుతో ప్రజలను పక్కదారి పట్టించడం మోసం చేయడమేనని అన్నారు. బీసీల అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు.. రాజకీయంగా మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన వివరాలు మాత్రమే స్వీకరించాలి.. బలవంతంగా వివరాలు స్వీకరిస్తే చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్వేచ్చను హరిస్తుంది.. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎందుకు కుల గణన చేయలేదని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.
Read Also: Truecaller: ట్రూకాలర్పై ఆదాయపు పన్ను శాఖ దాడులు.. ఆరోపణ ఏంటంటే?
తాజావార్తలు
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..