Tragedy: పిడుగుపాటుకు మైదానంలో ఆటగాడు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు(వీడియో)
- పెరూలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో తీవ్ర విషాదం
- మ్యాచ్ జరుగుతుండగా భారీ వర్షం
- ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా పిడుగు పాటు
- 39 ఏళ్ల జోస్ హోగో డి లా క్రూజ్ మెజా అక్కడికక్కడే మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఫుట్బాల్ మైదానంలో ఎన్నో అద్భుతమైన షాట్లు, గోల్స్ చూసి ఉంటాం. ఎంతో మంది ఆటగాళ్ల సత్తా కనపడుతుంది. అయితే పెరూలో జరిగిన ఈ బాధాకరమైన దుర్ఘటన మనం ఇంతకుముందు ఎక్కడ చూసి ఉండలేదు. ఆకాశం నుంచి వచ్చిన మెరుపు ఓ క్రీడాకారుడి ప్రాణం తీసింది. పెరూలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలాకాలో రెండు దేశీయ క్లబ్లు జువెటాడ్ బెల్లావిస్టా-ఫామిలియా చోకా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం జరుగుతుండగా, భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో.. రిఫరీ ఆటను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా.. పిడుగు పడింది.
Read Also: Delhi: మహిళా రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి కోర్టు సమన్లు..
Also Read
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
దీంతో.. వెంటనే ఐదుగురు ఆటగాళ్లు నేలపై పడిపోయారు. పిడుగుపాటుకు 39 ఏళ్ల జోస్ హోగో డి లా క్రూజ్ మెజా అక్కడికక్కడే మృతి చెందాడు. గోల్కీపర్ జువాన్ చోకా (40) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు యువకులకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో విచారాన్ని కలిగిస్తుంది. గతంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. ఇండోనేషియాలో 35 ఏళ్ల ఆటగాడు పిడుగుపాటుతో మృతి చెందాడు.
At least one person was killed after being struck by lightning on a soccer field in the city of Junín, Peru. pic.twitter.com/Ck8GEpCYo2
— Breaking News (@TheNewsTrending) November 4, 2024
Read Also: Health: మొలకలు వచ్చిన ఆలుగడ్డ తింటున్నారా..? ఎంత ప్రమాదకరమంటే
తాజావార్తలు
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..