ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా అరెస్ట్కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి, లోకేశ్ సహా ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొననున్నారు.
PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు అధికారులు స్వాగతం పలికారు.
Telangana Govt: అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో వేముల వీరేషం జాయిన్ అయిన తర్వాత ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నకిరేకల్ నేతల ముందు ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యపై హాట్ కామెంట్స్ చేశారు. మేము దగ్గరుండి గెలిపిస్తే.. మమ్మల్ని దారుణంగా మాట్లాడుతుండు.. మేము ఫస్ట్ జడ్పీటీసీగా గెలిపిస్తే.. పెద్ద పదవి ఎందుకు అన్నాడు.
ఇప్పుడు అంతా డిజిటైజ్ అయిపోయింది.. తప్పు చేయడం కుదరదు అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం.. ప్రభుత్వానికి ఉన్న మరి కొద్ది కాలంలో చేయగలిగినంత నేను మంత్రిగా చేస్తాను.. నిర్ణయాలు వెంట వెంటనే తీసుకుంటే ఉద్యోగులకు ఎలాంటి కష్టాలుండవు అని ఆయన అన్నారు.
TS Dalit Bandhu: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఇప్పటికే ఉన్న పథకాలను లబ్ధిదారులకు మరింత చేరువ చేయడమే హ్యాట్రిక్ సక్సెస్ లక్ష్యం.
చంద్రబాబు అరెస్ట్ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్ళు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు అల్లుడు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అని ఆరోపించారు.
డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్ను తిరుపతిరెడ్డి ఆశించారు. అయితే ఈ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉండటంతో కాంతారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు.