Tirupati Reddy: హాట్ కేక్లా మెదక్ అసెంబ్లీ టిక్కెట్.. కాంగ్రెస్ పార్టీకి తిరుపతి రెడ్డి రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్ను తిరుపతిరెడ్డి ఆశించారు. అయితే ఈ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉండటంతో కాంతారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
మైనంపల్లి హన్మంతరావు గత వారం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 28న న్యూఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. మల్కాజిగిరి నుంచి మైననంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి హన్మంతరావు కుమారుడు రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. మైనంపల్లి హన్మంతరావు 2009-2014 వరకు మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రోహిత్ కొంతకాలంగా మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ నుంచి బీఆర్ఎస్ టికెట్ తన కుమారుడు రోహిత్కు ఇవ్వాలని మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. కానీ, బీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
Also Read
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
- Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
దీంతో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంతరావు విమర్శలు గుప్పించారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అయితే మైనంపల్లి హన్మంతరావు కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని తేలడంతో తిరుపతిరెడ్డి కాంగ్రెస్ను వీడారు. డబ్బు మూటలు ఇచ్చిన వారికే పార్టీ టిక్కెట్లు ఇస్తారా లేక కర్ణాటక మాదిరి కాదా అని ప్రశ్నించారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా డబ్బున్న వారికి టిక్కెట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పార్టీ అభ్యర్థిగా మొదట హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు వేరొకరికి టికెట్ కేటాయించడంపై తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
Tiger Nageswara Rao: ‘హేమ లత లవణం’గా రేణు దేశాయ్…
తాజావార్తలు
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!