Tirupati Reddy: హాట్ కేక్లా మెదక్ అసెంబ్లీ టిక్కెట్.. కాంగ్రెస్ పార్టీకి తిరుపతి రెడ్డి రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్ను తిరుపతిరెడ్డి ఆశించారు. అయితే ఈ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉండటంతో కాంతారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
మైనంపల్లి హన్మంతరావు గత వారం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 28న న్యూఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. మల్కాజిగిరి నుంచి మైననంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి హన్మంతరావు కుమారుడు రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. మైనంపల్లి హన్మంతరావు 2009-2014 వరకు మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రోహిత్ కొంతకాలంగా మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ నుంచి బీఆర్ఎస్ టికెట్ తన కుమారుడు రోహిత్కు ఇవ్వాలని మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. కానీ, బీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
దీంతో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంతరావు విమర్శలు గుప్పించారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అయితే మైనంపల్లి హన్మంతరావు కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని తేలడంతో తిరుపతిరెడ్డి కాంగ్రెస్ను వీడారు. డబ్బు మూటలు ఇచ్చిన వారికే పార్టీ టిక్కెట్లు ఇస్తారా లేక కర్ణాటక మాదిరి కాదా అని ప్రశ్నించారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా డబ్బున్న వారికి టిక్కెట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పార్టీ అభ్యర్థిగా మొదట హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు వేరొకరికి టికెట్ కేటాయించడంపై తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
Tiger Nageswara Rao: ‘హేమ లత లవణం’గా రేణు దేశాయ్…
తాజావార్తలు
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
-
Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
-
America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
-
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..