Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Priyanka Gandhi Slams Centre Over Vande Mataram Debate In Lok Sabha

Priyanka Gandhi: వందేమాతరంపై చర్చ వెనుక కారణం ఇదే.. కేంద్రంపై ప్రియాంక గాంధీ సీరియస్

Published Date :December 8, 2025 , 5:15 pm
By Shiva Ganesh
  • నరేంద్ర మోడీ ఒకప్పటి ప్రధానిగా కనిపించడం లేదు
  • గొప్ప వ్యక్తులను అవమానించడమే ఈ చర్చ ఉద్దేశం
  • నెహ్రూ ఈ దేశం కోసమే జీవించారు
Priyanka Gandhi: వందేమాతరంపై చర్చ వెనుక కారణం ఇదే.. కేంద్రంపై ప్రియాంక గాంధీ  సీరియస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Priyanka Gandhi: లోక్‌సభలో వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలోని ప్రతి అణువులో వందేమాతరం ఉందని, మరి దాని గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గురించి చర్చిస్తోందని ఆమె ఆరోపించారు. వాస్తవానికి వందేమాతరం ప్రస్తావన వచ్చినప్పుడు, మనకు చరిత్ర గుర్తుకు వస్తుందని అన్నారు.

READ ALSO: Akhanda 2: తెరపైకి కొత్త డేట్.. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం?

“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకప్పటి ప్రధానిగా కనిపించడం లేదు. ఆయన మంచి ప్రసంగాలు చేస్తారు, కానీ వాస్తవాలను అర్థం చేసుకోరు. మోడీ ప్రజలకు వాస్తవాలను అందించే విధానం ఆయన నైపుణ్యానికి నిదర్శనం. కానీ నేను ప్రజా ప్రతినిధిని – కళాకారుడిని కాదు” అని ప్రియాంక గాంధీ అన్నారు. వందేమాతరం గురించి ప్రస్తావించినప్పుడు, మనకు మొత్తం చరిత్ర గుర్తుకు వస్తుందని, అది స్వాతంత్య్ర పోరాట చరిత్ర, స్వేచ్ఛ కోసం పోరాటం, నైతికత, బ్రిటిష్ సామ్రాజ్య పతనం గుర్తుకు వస్తుందన్నారు. వందేమాతరం భారతదేశ ప్రజలను రాజకీయ, నైతిక ఆకాంక్షతో అనుసంధానించిందని అన్నారు. వందేమాతరం నిద్రపోతున్న భారతదేశాన్ని మేల్కొలిపిందని, దానిపై ఈ రోజు చర్చ వింతగా అనిపిస్తుందని చెప్పారు. ఇంతకీ ఈ రోజు ఈ చర్చ అవసరం ఏమిటి, దీని ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నించారు.

వాస్తవానికి వందేమాతరంపై ప్రస్తుత చర్చ వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ప్రియాంక గాంధీ అన్నారు. మొదటిది బెంగాల్ ఎన్నికలు, రెండవది దేశం కోసం త్యాగాలు చేసిన వారిపై కొత్త ఆరోపణలు చేయాలనే ఈ ప్రభుత్వం కోరిక అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం భవిష్యత్తు వైపు చూడాలని అనుకోకుండా, మనల్ని గతంలోకి లాగడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. నిజం ఏమిటంటే నేడు ఉన్న ప్రధాన మంత్రి మోడీ ఒకప్పటి ప్రధానిగా లేరని, ప్రస్తుత ఆయన విధానాలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని అన్నారు. నేడు దేశ ప్రజలు సంతోషంగా లేరని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యం ప్రజలు అనేక సమస్యలతో పోరాడుతున్నారని, ప్రభుత్వం వాటికి పరిష్కారాలను కనుగొనడం లేదని అన్నారు. కొందరి కారణంగా దేశానికి హాని జరుగుతోందని అన్నారు. అందుకే ఈ రోజు వందేమాతరం గురించి చర్చిస్తున్నామని, వాస్తవానికి దేశంలోని ప్రతి అణువులో వందేమాతరం సజీవంగా ఉందని, దాని గురించి చర్చించకూడదని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలపై ఒత్తిడి తేకుండా దేశం దృష్టిని మళ్లించాలని ఈ ప్రభుత్వం వందేమాతరంపై చర్చ పెట్టి కోరుకుంటోందని ప్రియాంక గాంధీ అన్నారు. వందేమాతరం స్వభావాన్ని ప్రశ్నించడం దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తులను అవమానించడమే ఈ చర్చ ఉద్దేశమని విమర్శించారు. “నెహ్రూ ఇస్రోను సృష్టించకపోతే, మీరు ఈరోజు చంద్రుడిని చేరుకునేవారు కాదు. ఆయన గెయిల్, బిహెచ్ఇఎల్, సెయిల్‌లను సృష్టించకపోతే భారతదేశం ఎలా ఉండేది? పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ దేశం కోసమే జీవించారు” అని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

READ ALSO: Musheerabad Murder: దారుణం.. పెళ్లికి నో చెప్పిందని మరదలిని చంపిన మేనబావ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Centre vs Congress
  • Congress BJP rivalry
  • Indian Parliament debate
  • Lok Sabha debate news
  • Modi Government Criticism

తాజావార్తలు

  • iPhone 17e.. చౌకగా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్.. పనితీరు ఎలా ఉందంటే..?

  • Weather Update: బిగ్ అల‌ర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

  • Unseasonal Rains Damage: అకాల వర్షాలతో భారీ నష్టం.. ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం

  • Mahindra BE 6 Batman Edition: 999 మంది ఓనర్ల ఆగ్రహం.. మహీంద్రా సరెండర్.. BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌కు పూర్తి బైబ్యాక్!

  • Gate Results: గేట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions