Priyanka Gandhi: వందేమాతరంపై చర్చ వెనుక కారణం ఇదే.. కేంద్రంపై ప్రియాంక గాంధీ సీరియస్
- నరేంద్ర మోడీ ఒకప్పటి ప్రధానిగా కనిపించడం లేదు
- గొప్ప వ్యక్తులను అవమానించడమే ఈ చర్చ ఉద్దేశం
- నెహ్రూ ఈ దేశం కోసమే జీవించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: లోక్సభలో వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలోని ప్రతి అణువులో వందేమాతరం ఉందని, మరి దాని గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గురించి చర్చిస్తోందని ఆమె ఆరోపించారు. వాస్తవానికి వందేమాతరం ప్రస్తావన వచ్చినప్పుడు, మనకు చరిత్ర గుర్తుకు వస్తుందని అన్నారు.
READ ALSO: Akhanda 2: తెరపైకి కొత్త డేట్.. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం?
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకప్పటి ప్రధానిగా కనిపించడం లేదు. ఆయన మంచి ప్రసంగాలు చేస్తారు, కానీ వాస్తవాలను అర్థం చేసుకోరు. మోడీ ప్రజలకు వాస్తవాలను అందించే విధానం ఆయన నైపుణ్యానికి నిదర్శనం. కానీ నేను ప్రజా ప్రతినిధిని – కళాకారుడిని కాదు” అని ప్రియాంక గాంధీ అన్నారు. వందేమాతరం గురించి ప్రస్తావించినప్పుడు, మనకు మొత్తం చరిత్ర గుర్తుకు వస్తుందని, అది స్వాతంత్య్ర పోరాట చరిత్ర, స్వేచ్ఛ కోసం పోరాటం, నైతికత, బ్రిటిష్ సామ్రాజ్య పతనం గుర్తుకు వస్తుందన్నారు. వందేమాతరం భారతదేశ ప్రజలను రాజకీయ, నైతిక ఆకాంక్షతో అనుసంధానించిందని అన్నారు. వందేమాతరం నిద్రపోతున్న భారతదేశాన్ని మేల్కొలిపిందని, దానిపై ఈ రోజు చర్చ వింతగా అనిపిస్తుందని చెప్పారు. ఇంతకీ ఈ రోజు ఈ చర్చ అవసరం ఏమిటి, దీని ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నించారు.
వాస్తవానికి వందేమాతరంపై ప్రస్తుత చర్చ వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ప్రియాంక గాంధీ అన్నారు. మొదటిది బెంగాల్ ఎన్నికలు, రెండవది దేశం కోసం త్యాగాలు చేసిన వారిపై కొత్త ఆరోపణలు చేయాలనే ఈ ప్రభుత్వం కోరిక అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం భవిష్యత్తు వైపు చూడాలని అనుకోకుండా, మనల్ని గతంలోకి లాగడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. నిజం ఏమిటంటే నేడు ఉన్న ప్రధాన మంత్రి మోడీ ఒకప్పటి ప్రధానిగా లేరని, ప్రస్తుత ఆయన విధానాలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని అన్నారు. నేడు దేశ ప్రజలు సంతోషంగా లేరని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యం ప్రజలు అనేక సమస్యలతో పోరాడుతున్నారని, ప్రభుత్వం వాటికి పరిష్కారాలను కనుగొనడం లేదని అన్నారు. కొందరి కారణంగా దేశానికి హాని జరుగుతోందని అన్నారు. అందుకే ఈ రోజు వందేమాతరం గురించి చర్చిస్తున్నామని, వాస్తవానికి దేశంలోని ప్రతి అణువులో వందేమాతరం సజీవంగా ఉందని, దాని గురించి చర్చించకూడదని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై ఒత్తిడి తేకుండా దేశం దృష్టిని మళ్లించాలని ఈ ప్రభుత్వం వందేమాతరంపై చర్చ పెట్టి కోరుకుంటోందని ప్రియాంక గాంధీ అన్నారు. వందేమాతరం స్వభావాన్ని ప్రశ్నించడం దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తులను అవమానించడమే ఈ చర్చ ఉద్దేశమని విమర్శించారు. “నెహ్రూ ఇస్రోను సృష్టించకపోతే, మీరు ఈరోజు చంద్రుడిని చేరుకునేవారు కాదు. ఆయన గెయిల్, బిహెచ్ఇఎల్, సెయిల్లను సృష్టించకపోతే భారతదేశం ఎలా ఉండేది? పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశం కోసమే జీవించారు” అని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.
READ ALSO: Musheerabad Murder: దారుణం.. పెళ్లికి నో చెప్పిందని మరదలిని చంపిన మేనబావ..
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!