NTV WebDesk
Author- NTV Telugu-
LIVE: ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రెస్ మీట్
బీజేపీ సభపై మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సబ టీడీపీ అనుబంధ విభాగం సభలా బీజేపీ సభ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ లేదు.. అందుకే ప్రజల భావోద్వేగాలు ఏంటో వాళ్ళకు తెలియదు. రాష్ట్రంలో బీజేపీ శక్తి ఏంటో వాళ్ళకూ తెలుసు. చంద్రబాబు డైరెక్షన్ తోనే బీజేపీ సభ జరిగిందన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక మాయా ఫకీరు. దేశ చరిత్రలో మొదటి సారి ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో పని చేయటంచంద్రబాబు గంట […] -
ఎమ్మెల్యే ఆనం సెన్సేషనల్ కామెంట్స్
వైసీపీలో కొందరు నేతలు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వుంటారు. అందునా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్లు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది. తగ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియానే అన్నారు ఆనం. మాఫియాలు ఈ […] -
బీజేపీ దూకుడుకి బ్రేక్ పడిందా? ఆ ఎఫెక్టే కారణమా?
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, అమిత్ షా సభలు ఇప్పట్లో లేనట్టేనా? మంచి దూకుడు మీదున్న బీజేపీ స్పీడ్ కు ఆటంకాలు వచ్చాయా? ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగానే బీజేపీ యాత్రలు వాయిదా పడ్డాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిసెంబర్ 15 తరవాత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అయితే, ఇప్పటి వరకూ యాత్ర షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవైపు ఒమిక్రాన్ కేసులు.. […] -
కేంద్రం అందుకే దిగొచ్చిందా? కేసీఆర్ వ్యూహం ఫలించిందా?
తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా వివాదం చెలరేగింది. తాజాగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం కేసీఆర్, మంత్రుల బృందం వత్తిడి వల్లే కేంద్రం దిగివచ్చిందా? రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం దిగొచ్చింది. సీఎం కేసీఆర్ కృషి, మంత్రుల దౌత్యం ఫలించింది. వానా కాలం పంటకు సంబంధించి రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రం నుంచి మరో […] -
జనవరి చివరినాటికి ఏపీసీసీ సారథి.. రేసులో ఆయనే ఫస్ట్?
ఏపీలో కాంగ్రెస్ పార్టీని సమర్ధంగా నడిపించే నాథుడెవరు? కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చిందా? కాంగ్రెస్ ఆలోచనేంటి? రేసులో ముందున్నది ఎవరు? ఈ ప్రశ్నల్నిటికి సమాధానం రాబోతోంది. ఏపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు నియామకం కొలిక్కి వచ్చింది. ఫ్రంట్ రన్నర్ గా మాజీ ఎంపీ డా.చింతామోహన్ వున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలపై నివేదిక ను సిధ్దం చేయనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాందీ. సమర్ధుడు, విధేయుడు, సమన్వయంతో […] -
దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్
హైదరాబాద్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా రికవరీ అయి డిశ్చార్జ్ అయిన వారు 241మంది వున్నారు. తెలంగాణ దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 5వ స్థానంలో వుంది. తెలంగాణలో ఇప్పటివరకూ 62 కేసులు నమోదయ్యాయి. రికవరీ అయినవారు 10 మంది. ఇదిలా వుంటే శంషాబాద్లో దిగిన ఓ బాలుడికి ఒమిక్రాన్ సోకింది. దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్ ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులకు సోకింది వైరస్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని […] -
తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక కేసుల విచారణ
తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక కేసులు విచారణకు రానున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై నేడు హైకోర్టు విచారించనుంది. చెన్నమనేని తరపున నేడు మరోసారి వాదనలు వినిపించనున్నారు హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ. సిటిజన్ షిప్ యాక్ట్ నిబంధనలు, వాటి ఉల్లంఘన పై oci కార్డ్ అనుమతులపై నేడు వివరణ ఇవ్వనున్నారు చెన్నమనేని తరపు న్యాయవాది. నేడు మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఇటు ఇళ్ళ మధ్య ఉన్న పబ్ ల […] -
తెలంగాణ జైళ్ళలో మగ్గుతున్న చదువుకున్న యువత
యువతరం దేశానికి ఆధారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సామాజిక సేవ చేయాల్సిన యువత వివిధ నేరాలకు పాల్పడి జైళ్ళలో మగ్గుతున్నారు. తెలంగాణ జైళ్ళలో మగ్గుతున్న యువత ధైన్యస్థితి పలువురిని కలచివేస్తోంది. తెలంగాణ జైళ్ళలో ఖైదీలుగా అధిక శాతం యువత జైలు గోడలకే పరిమితం అవుతున్నారు. వివిధ కారణాల వల్ల వారు నేరస్తులుగా మారారు. 2020 నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల్లోని జైళ్ళ డేటాలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విడుదల చేసిన నివేదికలో అధిక శాతం […] -
భారత్లో పెరుగుతున్న కోవిడ్, ఒమిక్రాన్ కేసులు
దేశంలో కోవిడ్ ముప్పు తొలగడం లేదు. గత కొంతకాలంగా తక్కువగా నమోదవుతున్న కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా 9195 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 77,002 వున్నాయి. మరోవైపు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు. దేశంలో మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ లో అత్యధికంగా 238 కేసులు నమోదు కావడంతో ఆందోళన కలుగుతోంది. నిన్నటి “కోవిడ్” కేసులు […] -
ఆధ్యాత్మిక నగరంలో దొంగల హల్ చల్
తిరుపతి.. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి. ఈ నగరంలో పగలు, ప్రతీకారాలు, దొంగతనాలు తక్కువగా నమోదవుతుంటాయి. రాజకీయ దాడులు పక్కన పెడితే నేరాల సంఖ్య తక్కువే. అయితే ఈ మధ్యకాలంలో దొంగతనాలు తిరుపతి వాసుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తిరుపతి సమీప ప్రాంతాల్లో ఆగని చోరీలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగానికి దొంగతనాలు సవాల్ విసురుతున్నాయి. శ్రీనివాసమంగాపురంలో రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు దొంగలు. బీరువాలోని రూ.50వేల నగదు, 24గ్రాముల బంగారం […]
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!