ఒమిక్రాన్ పై డబుల్ మాస్క్లతో యుద్ధం చేయాల్సిందే
కరోనా సాధారణ ప్రజల జీవితాలను అస్త్యవస్తం చేసింది. కరోనా వచ్చి ఏడాది అవుతున్నా ఈ మాయాదారి మహమ్మారి ఇప్పటికి తన రూపురేఖలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా, బూస్టర్ డోసులు వేసుకున్నా ఎవ్వరేమి తక్కువ కాదు నాకు అందరూ ఒక్కటే అంటూ విరుచుకు పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా వెళ్లాయి. మరికొన్ని దేశాలు దీన్ని ఎదుర్కొవడానికి కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఏది ఏమైనా ప్రజలు సాధారణ జీవితాన్ని ఇప్పట్లో చూడటం కష్టమనే చెప్పాలి. దీంతో మరోసారి ఈ మహమ్మారిని ఎదుర్కొవడానికి మాస్క్ల ఆవశ్యకతపై చర్చ మొదలైంది. ఏది మంచింది. అనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి.
కోవిడ్ -19, ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్న ఈ వ్యాధుల నుంచి బయటపడేందుకు ప్రాథమిక రక్షణగా మాస్క్లు పనిచేస్తాయని డాక్టర్ల నమ్మకం కానీ, వీటి సామర్థ్యం పై ప్రజల్లో చాలా అను మానాలు ఉన్నాయి. ఎంతవరకు ఇవి రక్షణను ఇస్తాయనేదే ప్రశ్న. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ , వ్యాధి నియంత్రణ కేంద్రాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా పలు ఆరోగ్య సంరక్షణ సంస్థలు మాస్క్లను ఖచ్చితంగా ధరించాల్సిందేనని ఇప్పటికే చెప్పాయి. ప్రజలు టీకాలు వేసుకున్నారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా మాస్క్లు వాడాల్సిందేనని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.
Also Read
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..

డబుల్ లేయర్ మాస్క్లను ధరించాల్సిందే..
సింగిల్-లేయర్ క్లాత్ మాస్క్లు, సర్జికల్ మాస్క్ల నుంచి ప్రజలు డబుల్ లేయర్ మాస్క్లు లేదా N95 మాస్క్లకు అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థలు తరుచుగా చెబుతునే ఉన్నాయి. మాస్క్లతో పూర్తి రక్షణ కాకున్నా ఈ కరోనా వేరియంట్ను ఎదుర్కొవడంలో ప్రాథమికంగా రక్షణ కల్పిస్తాయి. అంతే కాకుండా మాస్క్లను సరిగ్గా ధరిస్తే అవి ప్రజలు పీల్చే గాలి నుంచి వైరస్ కణాలు ఫిల్టర్ చేయడం ద్వారా వ్యక్తులకు రక్షణను కల్పిస్తాయని ఆయా సంస్థలు పేర్కొన్నాయి.
ఎంత వరకు రక్షణ..?
ఈ డబుల్ లేయర్ మాస్క్లతో ఎంత వరకు రక్షణ ఉంటుందని ప్రజలు పలు అనుమానాలను లేవనేత్తుతున్నారు. అయితే ఆరోగ్య నిపుణలు మాత్రం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు, ఇన్ఫెక్షన్ దరి చేరకుండా N95 మాస్క్లు కాపాడుతాయని ఆరోగ్య సంస్థలు పేర్కొంటున్నాయి. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు N95 మాస్క్లను ధరించినప్పుడు, 1000 మంది వ్యక్తులలో 10 మందికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ, సాధారణ సర్జికల్ మాస్క్తో పోల్చినప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ 1,000 మందిలో ఒక్కరికే ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఖరీదైన N95 మాస్క్లను కొనుగోలు చేయలేని వారు ప్రత్యామ్నాయంగా రెండు-లేయర్డ్ డబుల్ మాస్క్లను ధరించాలని సూచిస్తున్నారు. ఇది ఎక్స్పోజర్ను నిరోధించడానికి కూడా సమర్థవంతమైన మార్గంగా పని చేస్తుంది. ఇది కూడా కుదరకపోతే ప్రజలు సర్జికల్ మాస్క్పై సాధారణ క్లాత్ మాస్క్ను ధరించడం ఉత్తమమైన పనిగా నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also:
తాజావార్తలు
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!