-
పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం…
టీడీపీ పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ విధానాలు.. చేపట్టాల్సిన ఆందోళనా కార్టక్రమాలపై చర్చ జరిపారు. రైతు, వ్యవసాయ సమస్యలపై నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటనలు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందన్న టీడీపీ నేతలు… విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖాపై ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతోందన్న చంద్రబాబు… ఏపీలోని డ్రగ్స్ మాఫియాపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని […] -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్..!
హుజురాబాద్ ఉపఎన్నిక నగారా మోగాక ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్ మొదలైందా? ఒకటి రెండు రోజుల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూల్ వస్తుందా? గులాబీ నేతలు లాబీయింగ్ తీవ్రం చేశారా? పదవీకాలం ముగిసిన వాళ్లలో ఎవరికి ఛాన్స్? పెద్దల సభకు వెళ్లే కొత్తవారు ఎవరన్నదే ఇప్పుడు ఉత్కంఠ. ఆరు ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇవ్వాలో సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చారా? తెలంగాణలో ఎమ్మెల్సీ ఖాళీలు ఆరు.. పోటీలో 60 మందికిపైగా ఉన్నారు. ఎవరిని పదవి వరిస్తుందోనన్న ఉత్కంఠ […] -
ఈటల కు మీరే గుణపాఠం చెప్పాలి…
కమలాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధూం ధాం కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి హరీశ్ రావు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ఈటల రాజేందర్ తన బాధను.. మనందరి బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాను రాసుకున్న బురదను.. మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నాడు. తన బాధను మన బాధగా మార్చుకుని ఆగమవుదామా.. మనందరి బాధలు తీర్చే కేసీఆర్ కు అండగా ఉందామా.. ఆలోచించండి అని […] -
ఖానాపూర్ కాంగ్రెస్లో గ్రూప్వార్ గుదిబండ..!
ఖానాపూర్ కాంగ్రెస్లో గ్రూప్వార్ గుదిబండగా మారబోతుందా ? పార్టీ నేతల్లో టికెట్ల పంచాయితీ అప్పుడే మొదలైందా? ఢిల్లీ చుట్టూ నేతలు ప్రదక్షిణలు మొదలు పెట్టారా ? ఖానాపూర్లో ఆదివాసీ, లంబాడాల ఆధిపత్యపోరు..! నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత రమేష్రాథోడ్ కమలం కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు ఖానాపూర్ కాంగ్రెస్లో పార్టీని నడిపే నాయకుడు కరువయ్యారు. ఈ నియోజకవర్గంలో ఆదివాసీలు, లంబాడాల ఆధిపత్య పోరు […] -
తెలుగు అకాడమీ కేసులో కీలక పాత్ర పోషించిన ముగ్గురు…
తెలుగు అకాడమీ కేసులో ముగ్గురు కీలక పాత్ర పోషించినట్లు గా పోలీసుల విచారణలో బయట పడింది. ముగ్గురు దొరికితే కానీ అసలు రహస్యం బట్టబయలు కాదని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్వలి కి ఈ ముగ్గురు సహకరించినట్లు గా విచారణలో వెలుగుచూసింది. రాజకుమార్, శ్రీనివాసు, సోమ శేఖర్ లు ఈ కేసులో కీలకంగా ఉన్నారని సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. మస్తాన్వలి నిధులను డ్రా చేసి ఇచ్చిన తర్వాత ఈ […] -
ఐపీఎల్ 2021 : కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం…
ఐపీఎల్ 2021 లో ఈ రోజు రెండవ మ్యాచ్ కోల్కతా నైట్రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెప్టెన్ విలియమ్సన్(26) నిలిచాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు, శివ మావి రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి […] -
పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..!
ఆ యంగ్ ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షాక్ ఇస్తున్నాయా? రెబల్స్ వర్సెస్ ఎమ్మెల్యే వార్ హోరెత్తుతోందా? విపక్షం స్పీడ్ పెంచడంతో.. ఇంటా, బయటా ఉక్కిరి బిక్కిరి తప్పడం లేదా? ఇంతకీ ఈ కుమ్ములాటలకు కేంద్రం ఎక్కడుంది? ఏంటా పంచాయితీ? పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..! విశాఖ జిల్లాలో ఎస్టీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన పాడేరు మన్యం ప్రాంత రాజకీయాలకు కేంద్ర బిందువు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ ఆధారంగా ఫలితాలు వచ్చాయి. 2014లో […] -
తెలంగాణ కరోనా అప్డేట్…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,828 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 162 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 247 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,546 కి చేరగా.. రికవరీ కేసులు […] -
ఐపీఎల్ 2021 : ప్లే ఆఫ్స్ లోకి మూడో జట్టుగా ఆర్సీబీ..
యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మొదటి మ్యాచ్లో పోటీపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఇక 165 పరుగులకు టార్గెట్ తో వచ్చిన పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసి ఆ తర్వాత తడబడింది. మొదటి వికెట్ కు కేఎల్ రాహుల్. మయాంక్ అగర్వాల్ 91 పరుగులు జోడించిన […] -
బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ దూరం…
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలకు ఇప్పటికే దూరంగా ఉండనున్నట్లు చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని, ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని కోరుతున్నట్టు పవన్ పేర్కొన్నారు. అయితే బద్వేలు ఉప ఎన్నికకు దూరం ఉండనున్నట్లు టీడీపీ కూడా తాజాగా ప్రకటించింది. ఈరోజు పొలిట్ బ్యూరోలో ఈ నిర్ణయం తీసుకుంది టీడీపీ. […]
తాజావార్తలు
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!