Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Paderu Ycp Politics

పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..!

Published Date :October 3, 2021 , 9:02 pm
By Manohar
పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఆ యంగ్ ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షాక్‌ ఇస్తున్నాయా? రెబల్స్ వర్సెస్‌ ఎమ్మెల్యే వార్ హోరెత్తుతోందా? విపక్షం స్పీడ్‌ పెంచడంతో.. ఇంటా, బయటా ఉక్కిరి బిక్కిరి తప్పడం లేదా? ఇంతకీ ఈ కుమ్ములాటలకు కేంద్రం ఎక్కడుంది? ఏంటా పంచాయితీ?

పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..!

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

విశాఖ జిల్లాలో ఎస్టీ రిజర్డ్వ్‌ నియోజకవర్గమైన పాడేరు మన్యం ప్రాంత రాజకీయాలకు కేంద్ర బిందువు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ ఆధారంగా ఫలితాలు వచ్చాయి. 2014లో గిడ్డి ఈశ్వరి, 2019లో కొత్తగుళ్లి భాగ్యలక్ష్మి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. పటిష్ఠమైన ఓటు బ్యాంకు, అధినాయకత్వంపై విధేయత కలిగిన కేడర్‌ ఉండటంతో పాడేరును కంచుకోటగా మార్చుకుంది వైసీపీ. అలాంటిచోట అధికారపార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్సెస్‌ లీడర్స్‌ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

ఎమ్మెల్యేను నిరాశపర్చిన పంచాయతీ, పరిషత్‌ ఎన్నికలు..!

ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఎదురవుతున్న ప్రతికూల ఫలితాలు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్గాన్ని కలవర పరుస్తున్నాయట. పటిష్ఠంగా ఉన్నామని భావిస్తున్నచోటే పంచాయతీ, పరిషత్‌ ఎన్నికలు ఎమ్మెల్యేను తీవ్ర నిరాశపర్చాయి. కీలకమైన పాడేరు పంచాయతీని అధికారపార్టీ కోల్పోయింది. నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా.. పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి కీలకం. పరిషత్‌ ఎన్నికల్లో మూడుచోట్ల ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గెలిచింది. పాడేరులో వైసీపీ రెబల్‌ ఎంపీపీ అయ్యారు. జి.మాడుగులలో టీడీపీ ఆఫర్‌తో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. చింతపల్లిలో ఎమ్మెల్యే బలపర్చిన అభ్యర్థిని కాదని రెబల్‌ పీఠం ఎక్కారు.

సీనియర్లను కలుపుకొని వెళ్లలేకపోతున్నారా?

పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితోపాటు వైసీపీలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మత్స్యరాస బాలరాజు, విశ్వేశ్వర్‌రాజు ముఖ్యనాయకులు. వీరితోపాటు ఎంపీ మాధవి వర్గానికి చెందిన ట్రయికార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని వెళ్లడం ఎమ్మెల్యేకు సాధ్యం కావడం లేదట. అదే సమయంలో వర్గ రాజకీయాలు కారణంగా ఆమె కొందరిని దూరం పెడతున్నారట. స్థానికంగా గిరిజన నాయకత్వాన్ని కాదని బయట వ్యక్తులను భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల చింతపల్లిలో జరిగిన సమావేశంలో కొయ్యూరు మండల అధ్యక్షుడు బహిరంగంగానే విమర్శలు చేశారు. వాల్మీకి కులం గుర్తింపును ప్రశ్నార్ధకం చేసేలా ఇటీవల వెబ్ సైట్లో మార్పులు చేయడంతో గిరిజన సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. స్ధానిక ఎమ్మెల్యేకు ఈ వ్యవహారంతో సంబంధం లేకపోయినా విమర్శలు ఎదుర్కోకక తప్పని పరిస్ధితి.

జడ్పీ ఛైర్‌పర్సన్‌ పీఠం దక్కక విశ్వేశ్వర్‌రాజు వర్గం గుర్రు..!

ఇటీవల జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఎన్నికలోనూ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అనుసరించిన వ్యూహం ప్రత్యర్ధులకు మింగుడుపడ్డం లేదట. ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన ఆ పీఠంపై ఆదిమ గిరిజన తెగకు చెందిన సుభద్రకు అవకాశం కల్పించారు. జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకుని జీకే వీధి నుంచి విశ్వేశ్వర్‌రాజు భార్య గెలిచారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు విశ్వేశ్వరరాజు కుటుంబానికే జడ్పీ పీఠం దక్కుతుందని అంతా ఊహించారు. చివరకు సుభద్ర పేరు ఖరారైంది. ఈ నిర్ణయం అధిష్ఠానమే తీసుకున్నప్పటికీ ఎమ్మెల్యే వ్యతిరేకించడంవల్లే తమకు అవకాశం రాకుండా పోయిందనే ఆవేదన విశ్వేశ్వరరాజు వర్గంలో ఉంది.

రెబల్స్‌పై చర్యల కోసం అధిష్ఠానం దగ్గరకు ఎమ్మెల్యే..!

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిన తర్వాత ఆ పార్టీ యాక్టివిటీ పెరిగింది. స్ధానిక రాజకీయాల్లో కొత్త వ్యూహాలను అమలు చేసి ఎమ్మెల్యేను ఇరుకున పెడుతోంది ప్రతిపక్షం. మరోవైపు దిద్దుబాటు చర్యల్లో భాగంగా వైసీపీలోని రెబల్స్‌పై చర్యల కోసం అధిష్ఠానాన్ని ఆశ్రయించారట ఎమ్మెల్యే. చీడపురుగులను పార్టీ నుంచి ఏరిపారేస్తామని భాగ్యలక్ష్మి వార్నింగ్‌ ఇస్తున్నారు. మరి.. ఉక్కిరి బిక్కిరి నుంచి భాగ్యలక్ష్మి ఎలా బయటపడతారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • paderu
  • paderu ycp
  • paderu ycp politics
  • Politics
  • ycp

తాజావార్తలు

  • Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..

  • Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు

  • CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

  • Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..

  • Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions