Flats as Gift: ఎంత మంచి సంస్థో.. ఉద్యోగులకు గిఫ్ట్ గా రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్స్..
- ఉద్యోగులకు గిఫ్ట్ గా రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్స్
- వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్
- ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు జెజియాంగ్ గుషెంగ్ ఆటోమొబైల్ కో. లిమిటెడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కంపెనీలు ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తుంటాయి. సంస్థ ఉన్నతికి కృషి చేసిన ఉద్యోగులకు బోనస్ లు, గిఫ్టులు ఇస్తుంటాయి. తాజాగా ఓ చైనీస్ కంపెనీ తన ఉద్యోగులను దీర్ఘకాలికంగా నిలుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానానికి నడుంబిగించింది. ఈ కంపెనీ కష్టపడి పనిచేసే, నమ్మకమైన ఉద్యోగులకు ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు జెజియాంగ్ గుషెంగ్ ఆటోమొబైల్ కో. లిమిటెడ్, వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్ లభిస్తుందని ప్రకటించింది. ఈ ఫ్లాట్ ధర సుమారు రూ.12 మిలియన్ల నుండి రూ.15 మిలియన్ల వరకు ఉంటుంది.
Also Read:Naga Chaitanya :నాగచైతన్య కెరీర్లో మరో సర్ప్రైజ్ ప్రాజెక్ట్ రెడీ!
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ఆ కంపెనీ ఇప్పటికే తన ప్రాంగణానికి సమీపంలో మొత్తం 18 ఫ్లాట్లను కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, ఈ ఫ్లాట్లను రెండు సంవత్సరాల క్రితం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి కంపెనీ 10 మిలియన్ యువాన్లకు (సుమారు రూ. 12.7 కోట్లు) పైగా ఖర్చు చేసింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఐదుగురు ఉద్యోగులకు ఫ్లాట్లు అందించింది. వీరిలో ఇద్దరు జూనియర్ పోస్టుల నుంచి మేనేజ్మెంట్ స్థాయికి ఎదిగిన ఉద్యోగులు ఉన్నారు. ఫ్లాట్లను స్వీకరించే ఉద్యోగులు కనీసం రాబోయే ఐదు సంవత్సరాలు కంపెనీలో పనిచేయాల్సిన ఒప్పందంపై సంతకం చేయాలి.
Also Read:Uttam Kumar Reddy : కేసీఆర్ కరెక్ట్గా ప్రిపేరై రండి, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారు
కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్ ప్రకారం, కష్టపడి పనిచేసే మరియు సమర్థవంతమైన ఉద్యోగులను గౌరవించడమే ఈ పథకం లక్ష్యం . వచ్చే ఏడాది మరో ఎనిమిది ఫ్లాట్లను అందజేస్తామని, మూడు సంవత్సరాలలోపు మొత్తం 18 ఫ్లాట్లను ఉద్యోగులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలిసిన పలు కంపెనీల ఉద్యోగులు ఎత మంచి సంస్థో అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!