Flats as Gift: ఎంత మంచి సంస్థో.. ఉద్యోగులకు గిఫ్ట్ గా రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్స్..
- ఉద్యోగులకు గిఫ్ట్ గా రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్స్
- వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్
- ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు జెజియాంగ్ గుషెంగ్ ఆటోమొబైల్ కో. లిమిటెడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కంపెనీలు ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తుంటాయి. సంస్థ ఉన్నతికి కృషి చేసిన ఉద్యోగులకు బోనస్ లు, గిఫ్టులు ఇస్తుంటాయి. తాజాగా ఓ చైనీస్ కంపెనీ తన ఉద్యోగులను దీర్ఘకాలికంగా నిలుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానానికి నడుంబిగించింది. ఈ కంపెనీ కష్టపడి పనిచేసే, నమ్మకమైన ఉద్యోగులకు ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు జెజియాంగ్ గుషెంగ్ ఆటోమొబైల్ కో. లిమిటెడ్, వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్ లభిస్తుందని ప్రకటించింది. ఈ ఫ్లాట్ ధర సుమారు రూ.12 మిలియన్ల నుండి రూ.15 మిలియన్ల వరకు ఉంటుంది.
Also Read:Naga Chaitanya :నాగచైతన్య కెరీర్లో మరో సర్ప్రైజ్ ప్రాజెక్ట్ రెడీ!
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ఆ కంపెనీ ఇప్పటికే తన ప్రాంగణానికి సమీపంలో మొత్తం 18 ఫ్లాట్లను కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, ఈ ఫ్లాట్లను రెండు సంవత్సరాల క్రితం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి కంపెనీ 10 మిలియన్ యువాన్లకు (సుమారు రూ. 12.7 కోట్లు) పైగా ఖర్చు చేసింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఐదుగురు ఉద్యోగులకు ఫ్లాట్లు అందించింది. వీరిలో ఇద్దరు జూనియర్ పోస్టుల నుంచి మేనేజ్మెంట్ స్థాయికి ఎదిగిన ఉద్యోగులు ఉన్నారు. ఫ్లాట్లను స్వీకరించే ఉద్యోగులు కనీసం రాబోయే ఐదు సంవత్సరాలు కంపెనీలో పనిచేయాల్సిన ఒప్పందంపై సంతకం చేయాలి.
Also Read:Uttam Kumar Reddy : కేసీఆర్ కరెక్ట్గా ప్రిపేరై రండి, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారు
కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్ ప్రకారం, కష్టపడి పనిచేసే మరియు సమర్థవంతమైన ఉద్యోగులను గౌరవించడమే ఈ పథకం లక్ష్యం . వచ్చే ఏడాది మరో ఎనిమిది ఫ్లాట్లను అందజేస్తామని, మూడు సంవత్సరాలలోపు మొత్తం 18 ఫ్లాట్లను ఉద్యోగులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలిసిన పలు కంపెనీల ఉద్యోగులు ఎత మంచి సంస్థో అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!