ఉత్తరాఖండ్లో విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
మణిపూర్లో భారత సైన్యం దేనినీ పరిష్కరించదు అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు. ఇప్పుడు 100 రోజులకు పైగా కొనసాగుతున్న జాతి హింసకు పరిష్కారం బుల్లెట్ల నుంచి కాకుండా గుండెల నుంచి రావాలన్నారు.
నాగ్పూర్ బీజేపీ నాయకురాలు సనా ఖాన్ అదృశ్యమైన పది రోజుల తర్వాత.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఆమెను హత్య చేసినందుకు ఆమె భర్త అమిత్ సాహును శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఐదు టీ20ల సిరీస్లో 2-1తో విండీస్ జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. రెండూ మ్యాచ్లు ఓడిపోయి మరో ఓటమి ఎదురైతే సిరీస్ చేజారే పరిస్థితిలో పుంజుకున్న టీమిండియా.. మూడో టీ20లో గెలిచి హమ్మయ్య అనుకుంది.
స్కూలు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న బాలికను ఓ ఆవు కొమ్ములతో దాడి చేసింది. రోడ్డుపైనే కొమ్ములతోనే ఆమెను కమ్మేసి నేలపై పడేసింది. ఆ తర్వాత పలుమార్లు బాలికను కొమ్ములతో పొడిచింది. కిందపడిపోయిన ఆ పాప కడుపులో కాళ్లతో తన్నింది.
అమెరికాలో హవాయి ద్వీపంలో ఏర్పడిన భీకర కార్చిచ్చు భారీ నష్టాన్ని మిగిల్చింది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మౌయి ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వేల ఇళ్లు అగ్నికి బూడిదయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 67 మంది మరణించారు.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన హర్యానాలోని నుహ్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవల సస్పెన్షన్ను హర్యానా ప్రభుత్వం శుక్రవారం వరకు పొడిగించింది. ఈ నెల ప్రారంభంలో హర్యానాలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 393 మందిని అరెస్టు చేశారు.
పశ్చిమ ఢిల్లీలోని ఇందర్పురి ప్రాంతంలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలుడిని ఓ మహిళ గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ బాలుడి నివాసంలోని బెడ్బాక్స్లో మృతదేహం లభ్యమైంది.
శుక్రవారం చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం సియుల్ నదిలో పడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది.
ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు గురైన నేపథ్యంలో గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదే సమయంలో హత్యపై దర్యాప్తులో సహాయం చేయాలని ఎఫ్బిఐని కోరారు. 59 ఏళ్ల జర్నలిస్ట్, అవినీతి వ్యతిరేక క్రూసేడర్ ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు సంబంధించి ఆరుగురు కొలంబియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.