Himantha Biswa Sarma: రాహుల్.. సైన్యం పౌరులపై కాల్పులు జరపాలని సూచిస్తున్నారా?
Himantha Biswa Sarma: మణిపూర్లో భారత సైన్యం దేనినీ పరిష్కరించదు అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు. ఇప్పుడు 100 రోజులకు పైగా కొనసాగుతున్న జాతి హింసకు పరిష్కారం బుల్లెట్ల నుంచి కాకుండా గుండెల నుంచి రావాలన్నారు. ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రంలో ఆర్మీ రెండు రోజుల్లో ఈ అల్లర్లను ఆపగలదని శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సూచించగా.. సైన్యం పౌరులపై కాల్పులు జరపాలని సూచిస్తున్నారా అని హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. “ఇండియన్ ఆర్మీ గతంలో మిజోరంలోని ఐజ్వాల్లో ఆ పని చేసింది. బాంబులు వేసిన తరువాత హింస తగ్గుముఖం పట్టింది. మణిపుర్లో హింసను భారత సైన్యమే ఆపాలని రాహుల్ అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? పౌరులపై కాల్పులు జరపాలా? అదే ఆయన ఉద్దేశమా? అలా ఎలా చెబుతారు? ఆర్మీ దేనినీ పరిష్కరించదు. తాత్కాలిక ప్రశాంతత మాత్రమే ప్రస్తుతానికి తీసుకురాగలదు. కానీ పరిష్కారం గుండె నుంచి రావాలి, బుల్లెట్ల నుండి కాదు.” అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
Read Also: Join My Wedding: పెళ్లి చేసుకోండి.. కోట్లు సంపాదించండి
Also Read
- Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఈ అంశంపై మొదట ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయని, ఆపై లోక్సభలో ప్రధాని మోదీ రెండు గంటలకు పైగా ప్రసంగం సందర్భంగా పార్లమెంటు నుండి వాకౌట్ చేయడం.. మణిపూర్కు సాయం చేయాలనే ఉద్దేశం విపక్షాలకు ఎంత మాత్రం లేదని తేలిపోయిందన్నారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడమే ప్రతిపక్షాల అజెండా అంటూ మండిపడ్డారు. మణిపుర్ రాష్ట్రం గురించి ప్రతి మాట ప్రధాని మనసుతో మాట్లాడారన్నారు. ఈశాన్యం గురించి ఆయన చూపిన చొరవ పట్ల సంతోషిస్తున్నామని హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.
గత నాలుగు నెలలుగా రాష్ట్రం మండిపోతున్నప్పుడు పార్లమెంటులో నవ్వడం, జోకులు పేల్చడం ప్రధానికి తగదని రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు.మణిపూర్ను కాల్చివేయాలని ప్రధాని కోరుకుంటున్నారని, దానిని కాల్చడానికి అనుమతిస్తున్నారని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాహు్ల్ గాంధీ ఆరోపించారు. హింసను ఆపాలని ప్రభుత్వం కోరుకుంటే, ప్రభుత్వం చేతిలో సాధనాలు ఉన్నాయని నొక్కి చెప్పారు.
VIDEO | "Solution has to come from the heart not from bullets," says Assam CM @himantabiswa on Congress leader Rahul Gandhi's 'Army can stop violence in Manipur' remark. pic.twitter.com/pY7JQ4KTxc
— Press Trust of India (@PTI_News) August 11, 2023
తాజావార్తలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
-
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!