Hawaii Wildfire: హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం.. 67కు చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hawaii Wildfire: అమెరికాలో హవాయి ద్వీపంలో ఏర్పడిన భీకర కార్చిచ్చు భారీ నష్టాన్ని మిగిల్చింది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మౌయి ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వేల ఇళ్లు అగ్నికి బూడిదయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 67 మంది మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నికి గాలులు తోడవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. లహైనా రిసార్టు నగరంలో ఈ ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కార్చిచ్చుకు ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ తెలిపారు.
Also Read: RMP Doctors: ఆర్ఎంపీ డాక్టర్లు ఫార్మా కంపెనీలతో సంబంధాలు పెట్టుకోరాదు.. ఎన్ఎంసీ కొత్త నిబంధనలు
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఈ కార్చిచ్చు వ్యాపిస్తున్నట్లు మౌయి కౌంటీ వెల్లడించింది. కార్చిచ్చుకు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలి బూడిదైనట్లు చెప్పారు. దావాగ్ని చుట్టుముట్టిన పరిస్థితుల కారణంగా అధికారులు రోడ్లను మూసివేశారు. 1960లో 61 మందిని బలిగొన్న సునామీని అధిగమించిన ఈ అడవి మంటలు దశాబ్దాలలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యం. 1946లో సంభవించిన ఘోరమైన సునామీ కారణంగా 150 మందికి పైగా మరణించారు.
Also Read: Tomato price: టమోటా ధర ఢమాల్.. అక్కడ కిలో టమోటా రూ.30..
సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గవర్నర్ జోష్ గ్రీన్ హెచ్చరించారు. లాహైనా నివాసితులు వారి ఆస్తులను తనిఖీ చేయడానికి శుక్రవారం తిరిగి రావడానికి అనుమతించబడతారని, ప్రజలు నీటిని పొందడానికి, ఇతర సేవలను పొందేందుకు కూడా బయటకు వెళ్లగలరని కూడా ఆయన చెప్పారు. శనివారం ఉదయం 6 గంటల వరకు అధికారులు కర్ఫ్యూ విధించారు. వందలాది పైపులు పాడైపోయినందున తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రజలు నీటిని మరిగించిన తర్వాత కూడా తాగకూడదని మౌయ్ కౌంటీ వాటర్ ఏజెన్సీ డైరెక్టర్ జాన్ స్టఫుల్బీన్ తెలిపారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!