-
చంద్రబాబుకు గొడవలే కావాలి..అదే ఆయన రాజకీయం : సజ్జల
చంద్రబాబుపై మరోమారు ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు కుప్పంను కబ్జా చేసి కోటలాగా మార్చుకున్నాడని… కుప్పంలో చంద్రబాబును దారుణం ఓడించారని ఆగ్రహించారు. అమరావతి యాత్ర ప్రజల యాత్ర కాదు.. టీడీపీ నేతలే యాత్ర చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబుకు ఎక్కడో చోట గొడవ కావాలి.. అదే ఆయన రాజకీయం అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆగ్రహించారు. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజకీయ పదవుల్లో కూడా […] -
పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్ మొద్దు నిద్ర పోతుండు : వైఎస్ షర్మిల
సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్ మొద్దు నిద్ర పోతుండంటూ ఎద్దేవా చేశారు. 2 నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని రైతులు కన్నీళ్లు పెడుతున్నా దొరకు కనిపించడం లేదని ఆగ్రహించారు. వడ్లు కొనకుండా ఇక్కడ ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేయడంతో మరో రైతు గుండె ఆగిపోయిందని పేర్కొన్నారు. అయ్యా కేసీఆర్ ఇంకెంత మంది చస్తే వడ్లు కొంటారని నిలదీశారు. ఇంకెంతమంది రైతుల ఉసురు తీస్తే […] -
ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన 11మంది వైసీపీ సభ్యులు
ఎమ్మెల్సీలుగా 11మంది వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది సభ్యులు… ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు… విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, చెన్నూబోయిన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే… తూర్పుగోదావరి నుండి అనంత సత్య ఉదయ భాస్కర్( బాబు)…. కృష్ణా జిల్లా నుండి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్ ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు […] -
సీతమ్మధారలో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ
విశాఖ సీతమ్మధారలో 108 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. ఈ కార్యక్రమంలో… ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ప్రతిష్టించారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ… విశాఖలో ఇంత పెద్ద అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామి, విశాఖ లో ఉన్న దేవతమూర్తులు విశాఖను కాపాడుతున్నారని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు నుంచి.. ఆ దేవతమూర్తులు రక్షిస్తున్నారని […] -
తెలంగాణ బీజేపీ ఎంపీలతో రేపు అమిత్ షా భేటీ..!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రేపు భేటీ కానున్నారు. రెండు రోజుల కిందట అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఈ నేపథ్యంలోనే… బండి సంజయ్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. రేపు (09.12.2021 గురువారం) అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి […] -
విద్యుత్ నియంత్రణ భవన్ కు గవర్నర్ తమిళిసై శంకుస్థాపన
విద్యుత్ నియంత్రణ భవన్ కు శంకుస్థాపన చేశారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఈ కార్యక్రమంలో… ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు, సీఎండీ ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ… ఈఆర్సీ కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని… ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన […] -
ఒమిక్రాన్తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి.. పెరిగిన కేసులు !
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. రెండువారాల క్రితం నిత్యం వందల సంఖ్యలో వెలుగుచూసిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 10వేలు దాటింది. డిసెంబర్ తొలివారంలో రోజువారీ కేసుల సంఖ్య 16వేలకు చేరింది. దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం గణాంకాల ప్రకారం ఆ దేశంలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 86 వేలు దాటింది. వారం రోజుల్లోనే కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. రెండు వారాల కిందట కోవిడ్ పాజిటివిటీ […] -
ఇండియాలో కొత్తగా 8,439 కరోనా కేసులు
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరిగి పోతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,439 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. మరో 195 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 473,952 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93,733 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ […] -
కారు నడుపుతూ బైక్ను ఢీకొట్టిన సీరియల్ నటి లహరి కారు !
శంషాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. టీవీ సీరియల్స్ నటి లహరి కారు నడుపుతూ బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత కారు చుట్టూ గుమిగూడిన జనాల్ని చూసి భయపడిన లహరి, కిందికి దిగలేదు. దాంతో పోలీసులు, ఆమెను కారులోనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. లహరి మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. అయితే ఆమె మద్యం […] -
నేడు ఈడీ ముందుకు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ !
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు సమన్లు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… మనీలాండరీంగ్ కేసులో ఇవాళ ఢిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 200 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ… ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య, నటి లీనా మరియా పాల్తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్షీట్లో చేర్చింది. సుకేశ్ చంద్రశేఖర్… జాక్వెలిన్కు విలువైన బహుమతులు ఇచ్చినట్టు గుర్తించి… ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించారు ఈడీ అధికారులు. […]
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!