ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరిగి పోతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,439 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. మరో 195 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 473,952 కు చేరుకుంది.
ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93,733 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 129.5 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇక దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 3,40,89,137 మంది పూర్తిగా కోలుకున్నారు.