-
ఈటలకు షాక్ : హుజురాబాద్ బరిలో మరో ముగ్గురు రాజేందర్లు..!
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతోంది. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. ఇక నిన్న హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే.. తాజాగా ఈ ఉప ఎన్నికలో ట్విస్ట్ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేరుతో నలుగురు ఉన్నారు. బిజెపి తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉండగా… ఆఖరి రోజున రాజేందర్ పేరుతో […] -
ఇండియాలో తగ్గిన కరోనా.. కొత్తగా 19,740 కేసులు
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 19,740 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో 2,36,643 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 248 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,50, 375 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో […] -
హైదరాబాద్ ను వణికించిన వర్షం.. పలు కాలనీలు జలమయం
హైదరాబాద్ గుండె మరోసారి చెరువైంది. రోడ్లు జలాశయాలను తలపించాయి. దాదాపు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా కురిసిన భారీ వర్షానికి ఏది రోడ్డో , ఏది నాలానో తెలియని పరిస్థితి. నగరవాసులు ఇళ్లకు చేరుకునే సమయంలో వర్షం మొదలవడంతో ఎక్కడికక్కడ జనం రోడ్లపక్కన తలదాచుకున్నారు. వరదనీటిలో చిక్కుకుని పలువురు ప్రమాదానికి గురయ్యారు. ఎల్బీనగర్ సమీపంలోని చింత కుంటలో డ్రైనేజీలో పడి గల్లంతైన వ్యక్తి […] -
అఫ్ఘానిస్థాన్లో ఆత్మాహుతి దాడి… వంద మందికి పైగా మృతి..!
అఫ్ఘానిస్థాన్లో మరో సారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. కుందూజ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. కుందుజ్ ప్రావిన్స్ బందర్ జిల్లా ఖాన్ అదాబ్లో గల షియా మసీదులో జరిగిన పేలుడులో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు అఫ్ఘాన్ అధికార వార్త సంస్థ బక్తర్ కథనాలను బట్టి తెలుస్తోంది. అలాగే, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత ఆగస్టులో […] -
ఐపీఎల్ 2021 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు
IPLలో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. హైదరాబాద్పై గెలిచినా… మెరుగైన రన్ రేట్ లేకపోవడంతో… రోహిత్ సేనకు ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయాయి. ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్పై 171 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండటంతో… టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై… ధాటిగా ఆడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే… సన్రైజర్స్ను చితగ్గొట్టింది. 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి… […] -
సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారు
ఏపీ సీఎం జగన్ ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 11వ తేదీ తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు… సీఎం. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు… పైకప్పుతో కొత్తగా నిర్మితమైన అలిపిరి మెట్ల మార్గాన్ని, పాదాల మండపం వద్ద కొత్తగా నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని… శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 11న రాత్రికి పద్మావతి […] -
ఢిల్లీ జోరుకు కళ్లెం వేసిన బెంగళూరు..
IPLలో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్యాన్స్కు అసలు సిసలు మజా ఇచ్చింది. చివరి బంతి దాకా ఎవరు గెలుస్తారో తెలీని ఉత్కంఠ మధ్య… చివరికి ఢిల్లీపై బెంగళూరు పైచేయి సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ఢిల్లీ బ్యాటింగ్కు దిగాక… ఓపెనర్లు ధాటిగా ఆడారు. 10 ఓవర్లలోనే 88 పరుగుల భాగస్వామ్యం అందించారు. పృథ్వీ షా 48 రన్స్, శిఖర్ ధావన్ 43 రన్స్ చేశారు. రిషబ్ పంత్ కేవలం 10 పరుగులే చేసి […] -
అక్టోబర్ 9, శనివారం దిన ఫలాలు
మేషం :- భాగస్వామ్యుల మధ్య ఎదుటివారి కారణంగా ఆపోహలు తలెత్తగలవు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. సాహస ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు నరాలకు సంబంధించిన చికాకులు అధికవుతాయి. వస్తువుల పట్ల ఆపేక్ష అధికమవుతుంది. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. వృషభం :- విద్యుత్ లోపం వల్ల గృహం లేక వ్యాపార సంస్థల్లో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి. చర్మానికి సంబంధించిన చికాకులు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. తలపెట్టిన పనులు […] -
ఈటల గెలిస్తే బండి సంజయ్ కు ప్రమాదం : రేవంత్
హుజురాబాద్ ఎన్నికల్లో ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్ కు ప్రమాదం, ఆ తర్వాత కిషన్ రెడ్డికే ప్రమాదమని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కేంద్రంతో పోరాటం అనేది సుద్ద తప్పు అని… యూపీ ఎలక్షన్ల కోసమే మోదీ, అమిత్ షా కేసీఆర్ ను దగ్గరకు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర […] -
కాకినాడలో పట్టాభి కామెంట్స్ కలకలం..!
డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన కామెంట్స్ ఆ పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయా? రాజకీయ లబ్ధికోసం గుడ్డిగా ఏదేదో మాట్లాడి ఓ సామాజికవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితి దాపురించిందా..? కాకినాడ ఎపిసోడ్ తర్వాత టీడీపీలో వినిపిస్తున్న గుసగుసలేంటి.. రుసరుసలేంటి..? కాకినాడలో పట్టాభి కామెంట్స్ కలకలం..! ముంద్రా పోర్టులో హెరాయిన్ పట్టుబడిన అంశాన్ని అధికార వైసీపీకి చుట్టేస్తూ.. టీడీపీ పెద్దఎత్తున ప్రెస్మీట్ల పోరాటం చేస్తోంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయేంత వరకు టీడీపీలో చంద్రబాబు […]
తాజావార్తలు
-
PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!