ఐపీఎల్ 2021 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPLలో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. హైదరాబాద్పై గెలిచినా… మెరుగైన రన్ రేట్ లేకపోవడంతో… రోహిత్ సేనకు ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయాయి. ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్పై 171 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండటంతో… టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై… ధాటిగా ఆడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే… సన్రైజర్స్ను చితగ్గొట్టింది. 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి… కేవలం 16 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని బాదుడుకు ముంబై స్కోరు 7.2 ఓవర్లలోనే వంద దాటింది.
ఫిఫ్టీ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన ఇషాన్… 32 బంతుల్లోనే 84 పరుగులు చేసి ఔటయ్యాడు.ఇషాన్కు తోడు సూర్యకుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయి ఆడాడు. కేవలం 40 బంతుల్లోనే 82 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇషాన్, సూర్యకుమార్ రేంజ్లో ముంబై మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. రోహిత్ 18, పొలార్డ్ 13, పాండ్యా 10 పరుగులే తీశారు. చివరి వరుస బ్యాట్స్మెన్ కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దాంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది… ముంబై. 236 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్కు… ఓపెనర్లు శుభారంభం అందించారు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తొలివికెట్కు 5.2 ఓవర్లలో 64 రన్స్ జోడించారు. జేసన్ రాయ్ 34 రన్స్ చేయగా, అభిషేక్ శర్మ 33 రన్స్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ మనీష్ పాండే ధాటిగా ఆడటంతో… హైదరాబాద్ స్కోర్ బోర్డు ఉరకలు వేసింది. మనీష్ 41 బంతుల్లోనే 69 రన్స్ చేశాడు. మనీష్ ఔటయ్యాక ప్రియం గార్గ్ మినహా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోవడంతో… 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులే చేయగలిగింది… హైదరాబాద్. ముంబై 42 పరుగుల తేడాతో గెలిచినా… భారీ వ్యత్యాసంతో నెగ్గకపోవడంతో… ప్లే ఆఫ్ దశకు చేరకుండానే IPL నుంచి నిష్క్రమించింది. 32 బంతుల్లోనే 84 రన్స్ చేసిన ఇషాన్ కిషన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!