ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్ వేసుకునేవారు.. కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అమేథిలో సీటును బుక్ చేసుకునేందుకు కర్చీఫ్ వేస్తారేమోనంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేసింది.
భారీగా తరలి వచ్చిన అశేష జనవాహనితో పెదకూరపాడు జనసంద్రంగా మారింది. పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకరరావు నామినేషన్ దాఖలు చేశారు.
చైనాలోని దక్షిణ ప్రావిన్స్లోని గ్వాంగ్డాంగ్లో భారీ వర్షం కురిసి, ఆ ప్రాంతం చెరువులా మారింది. గత 65 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాల కారణంగా 4గురు చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు.
హమాస్పై యుద్ధంతో ఇరాన్ మద్దతు గల సంస్థ హిజ్బుల్లా సోమవారం నాడు అర్థరాత్రి ఇజ్రాయెల్పై 35 రాకెట్లతో దాడి చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది.
సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ప్రియురాలి యొక్క హత్యకు కారణం కావడంతో ఆ వ్యక్తికి ఈ శిక్ష విధించబడింది.
భూతాపం వల్ల హిమాలయాల్లోని మంచు పర్వతాలు రోజు రోజుకి కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వెల్లడించింది.
రాబోయే 5 రోజుల పాటు తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి తరంగాల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాగే, అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్లోని ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.