శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో మొత్తం 70 ఏళ్ల పరిపాలన కాలంలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు అద్భుతంగా పని చేశారని ఆయన పేర్కొన్నారు. పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి వారి పరిపాలనలో దేశం అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. అయితే, వీరంతా కలిసి నిర్మించిన భారత దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వేలం పెట్టారని విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి కూడా వేలం పాట ఉండి ఉంటే? దానిని కూడా మోడీ వేలం వేసేవారేమో? అనే అనుమానం కలుగుతుందని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
Read Also: Piyush Goyal: చంద్రబాబు సీఎం అవుతారు.. ఏపీ నుంచి మా కూటమికి 25 ఎంపీలు..!
కాగా, 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీతో పాటు ఆయన పార్టీ అధికారంలో ఉండదు అని శివసేన (యూబీటీ ) నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. బీజేపీకి తాము ఓడిపోతామని ముందే తెలుసు.. అందు కోసమే వారు రాముడి పేరు చెప్పుకుని గెలవాలని అనుకుంటున్నారు. కానీ, రాముడి వారితో లేరని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల తర్వాత ప్రజల గురించి, ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి ఆలోచించే సమర్థుడైన వ్యక్తి ఈ దేశానికి ప్రధాన మంత్రిగా ఉంటారని రౌత్ వెల్లడించారు. బుధవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. శివసేన అధ్యక్షుడి ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకాక పోవడం ద్వారా శ్రీరాముడిని అవమానించారని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్గా ఎంపీ సంజయ్ రౌత్ ఈ కామెంట్స్ చేశారు.