Sanjay Raut: 50 ఏళ్లలో కాంగ్రెస్ ప్రధానులు బాగా పని చేస్తే.. మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో మొత్తం 70 ఏళ్ల పరిపాలన కాలంలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు అద్భుతంగా పని చేశారని ఆయన పేర్కొన్నారు. పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి వారి పరిపాలనలో దేశం అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. అయితే, వీరంతా కలిసి నిర్మించిన భారత దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వేలం పెట్టారని విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి కూడా వేలం పాట ఉండి ఉంటే? దానిని కూడా మోడీ వేలం వేసేవారేమో? అనే అనుమానం కలుగుతుందని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
Read Also: Piyush Goyal: చంద్రబాబు సీఎం అవుతారు.. ఏపీ నుంచి మా కూటమికి 25 ఎంపీలు..!
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
కాగా, 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీతో పాటు ఆయన పార్టీ అధికారంలో ఉండదు అని శివసేన (యూబీటీ ) నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. బీజేపీకి తాము ఓడిపోతామని ముందే తెలుసు.. అందు కోసమే వారు రాముడి పేరు చెప్పుకుని గెలవాలని అనుకుంటున్నారు. కానీ, రాముడి వారితో లేరని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల తర్వాత ప్రజల గురించి, ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి ఆలోచించే సమర్థుడైన వ్యక్తి ఈ దేశానికి ప్రధాన మంత్రిగా ఉంటారని రౌత్ వెల్లడించారు. బుధవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. శివసేన అధ్యక్షుడి ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకాక పోవడం ద్వారా శ్రీరాముడిని అవమానించారని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్గా ఎంపీ సంజయ్ రౌత్ ఈ కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!