Sanjay Raut: 50 ఏళ్లలో కాంగ్రెస్ ప్రధానులు బాగా పని చేస్తే.. మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో మొత్తం 70 ఏళ్ల పరిపాలన కాలంలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు అద్భుతంగా పని చేశారని ఆయన పేర్కొన్నారు. పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి వారి పరిపాలనలో దేశం అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. అయితే, వీరంతా కలిసి నిర్మించిన భారత దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వేలం పెట్టారని విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి కూడా వేలం పాట ఉండి ఉంటే? దానిని కూడా మోడీ వేలం వేసేవారేమో? అనే అనుమానం కలుగుతుందని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
Read Also: Piyush Goyal: చంద్రబాబు సీఎం అవుతారు.. ఏపీ నుంచి మా కూటమికి 25 ఎంపీలు..!
Also Read
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
కాగా, 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీతో పాటు ఆయన పార్టీ అధికారంలో ఉండదు అని శివసేన (యూబీటీ ) నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. బీజేపీకి తాము ఓడిపోతామని ముందే తెలుసు.. అందు కోసమే వారు రాముడి పేరు చెప్పుకుని గెలవాలని అనుకుంటున్నారు. కానీ, రాముడి వారితో లేరని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల తర్వాత ప్రజల గురించి, ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి ఆలోచించే సమర్థుడైన వ్యక్తి ఈ దేశానికి ప్రధాన మంత్రిగా ఉంటారని రౌత్ వెల్లడించారు. బుధవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. శివసేన అధ్యక్షుడి ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకాక పోవడం ద్వారా శ్రీరాముడిని అవమానించారని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్గా ఎంపీ సంజయ్ రౌత్ ఈ కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!