Rahul Gandhi: అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సన్నాహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి సంకేతాలు అందడంతో స్థానిక కాంగ్రెస్ కమిటీ చురుగ్గా ప్రచారం చేస్తుంది. కాగా, నేడు లేదా రేపు రాహుల్ గాంధీ బృందం అమేథీకి వెళ్లబోతుంది. నేటి నుంచి అమేథీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కానీ, బీజేపీ మినహా ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ఇప్పటి వరకు అమేథీలో ప్రకటించలేదు. అయితే, గురువారం నాడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయబోతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పై స్థాయి నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో కాంగ్రెస్ కార్యాలయంలో సీనియర్ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి.
Read Also: Jagdeep Dhankhar: నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్.. కన్హా శాంతివనం సందర్శన..
Also Read
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
కాగా, మే 2వ తేదీన అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేస్తారని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమ ఎన్నికల నిర్వహణను చూసేందుకు ఢిల్లీ నుంచి పలువురు ప్రముఖులు శనివారం లేదా ఆదివారం అమేథీకి చేరుకుంటున్నారు. ఇక, రాహుల్ కూడా అమేథీకి రాకముందే అయోధ్యకు వెళ్లే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. భారత్ జోడో యాత్ర అమేథీలో ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ అయోధ్యలో పర్యటించాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ తరువాత దానిని రద్దు చేయారు. ఇక, నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోగేంద్ర మిశ్రా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోందన్నారు. ఇక, ఎన్నికల నిర్వహణను చూసే బృందం మొత్తం మరో ఒకటి రెండు రోజుల్లో అమేథీకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
Read Also: Dear OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అయితే, అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వానికి సంబంధించి అన్ని విషయాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. రాహుల్, ప్రియాంక పేర్లపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో ప్రియాంక గాంధీ గురువారం నాడు రాయ్బరేలీకి రావడంపై కూడా చర్చ జరిగింది. ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ఏఐసీసీ ప్రకటిస్తుందని విశ్వసనీయ సమాచారం.
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!