Rahul Gandhi: అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సన్నాహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి సంకేతాలు అందడంతో స్థానిక కాంగ్రెస్ కమిటీ చురుగ్గా ప్రచారం చేస్తుంది. కాగా, నేడు లేదా రేపు రాహుల్ గాంధీ బృందం అమేథీకి వెళ్లబోతుంది. నేటి నుంచి అమేథీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కానీ, బీజేపీ మినహా ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ఇప్పటి వరకు అమేథీలో ప్రకటించలేదు. అయితే, గురువారం నాడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయబోతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పై స్థాయి నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో కాంగ్రెస్ కార్యాలయంలో సీనియర్ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి.
Read Also: Jagdeep Dhankhar: నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్.. కన్హా శాంతివనం సందర్శన..
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
- iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
కాగా, మే 2వ తేదీన అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేస్తారని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమ ఎన్నికల నిర్వహణను చూసేందుకు ఢిల్లీ నుంచి పలువురు ప్రముఖులు శనివారం లేదా ఆదివారం అమేథీకి చేరుకుంటున్నారు. ఇక, రాహుల్ కూడా అమేథీకి రాకముందే అయోధ్యకు వెళ్లే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. భారత్ జోడో యాత్ర అమేథీలో ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ అయోధ్యలో పర్యటించాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ తరువాత దానిని రద్దు చేయారు. ఇక, నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోగేంద్ర మిశ్రా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోందన్నారు. ఇక, ఎన్నికల నిర్వహణను చూసే బృందం మొత్తం మరో ఒకటి రెండు రోజుల్లో అమేథీకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
Read Also: Dear OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అయితే, అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వానికి సంబంధించి అన్ని విషయాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. రాహుల్, ప్రియాంక పేర్లపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో ప్రియాంక గాంధీ గురువారం నాడు రాయ్బరేలీకి రావడంపై కూడా చర్చ జరిగింది. ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ఏఐసీసీ ప్రకటిస్తుందని విశ్వసనీయ సమాచారం.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!