Supreme Court: నేడు ఈవీఎం- వీవీప్యాట్ ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను అక్కడే ఉంచే వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో వందకు వందశాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఓ వైపు నేడు రెండో విడత పోలింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ఈ కీలక తీర్పు వెల్లడి కానుండటం గమనార్హం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇవాళ ఉదయం 10. 30 గంటలకు ఈ తీర్పును వెలువరించనుంది.
Read Also: Lakshmi Stotram: సకల సంపదలు చేకూరాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
కాగా, ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ (ఈసీ)పై సవాలు చేసిన పిటిషనర్లలో అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తదితరులు ఉన్నారు. ఇక, బుధవారం నాడు ఈవీఎంలు, వీవీ ప్యాట్లతో ముడిపడిన పలు ప్రశ్నలను ద్విసభ్య ధర్మాసనం సంధించగా.. స్వయంగా ఎన్నికల కమిషన్ నిపుణుల కమిటీ న్యాయస్థానికి వచ్చి వాటికి తగిన సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాలన్నీ విన్నాక.. కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించడం తమ పని కాదని క్లారిటీ ఇచ్చింది. ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి తాము మార్గదర్శకాలను ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడుతున్న తీర్పుపై ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!