Minister Kollu Ravindra: మద్యం ధరల పెంపుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు..
- మద్యం ధరల పెంపుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు..
- మార్జిన్ పెంచడం వల్ల బాటిల్ పై రూ. 10 పెంచడం జరిగింది..
- గతంలో చెత్త బ్రాండ్లు ఉండేది.. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన ఉన్నాయి: మంత్రి కొల్లు రవీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: ఏపీలో లిక్కర్ ధరల పెంపకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఎకైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 వేల షాపులకు 90 వేల దరఖాస్తులు వచ్చాయి.. చాలా పారదర్శకంగా మద్యం దుకాణాల అలాట్మెంట్ జరిగింది.. గతంలో పనికి రాని చెత్త బ్రాండ్లు ఉండేవి అన్నారు. మార్జిన్ పెంచడం వల్ల బాటిల్ పై పది రూపాయలు పెంచడం జరిగింది.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అని ఆయన మండిపడ్డారు. కల్లు గీత కార్మికులకు 10 శాతం షాపులను కేటాయించాము.. కల్లు గీత కార్మికుల విషయంలో కోర్టుకు వెళ్లినా బలంగా వాదించాం.. ప్రజాలకు కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.. పెరిగిన ఛార్జీలు కేవలం 1 శాతం మాత్రమే అని మంత్రి రవీంద్ర అన్నారు.
Read Also: Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఇక, జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో రూ.12 వేల కోట్లు చెల్లింపులు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మరో రూ.13 వేల కోట్లను చెల్లించాల్సి ఉంది.. వైసీపీ హాయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేశారు.. మద్యంలో జగన్ సర్కార్ చేసిన తప్పుల్ని ఒక్కోక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నాం.. గతంలో మద్యం నకిలీ బ్రాండ్లతోనూ రాష్ట్రంలో విక్రయాలు జరిపారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నాం.. మద్యం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.. అన్ని రకాల తనిఖీలు చేశాకే మద్యం విక్రయాలు చేస్తున్నాం.. గతంలో వైసీపీ చేసిన పనులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. గతంలో సిండికేట్లను ఏర్పాటు చేసింది వైసీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టింది అని ఆరోపించారు. అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకొమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!