Kuppam Crime: అనైతిక బంధం.. రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. అడ్డుగా ఉన్న భర్తల ప్రాణాలు తీసిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి… కుటుంబం కోసం సంపాదనతో భర్త బిజీగా ఉంటే… మరో వ్యక్తితో రంకు నడుపుతోన్న కొందరు ముదురు మహిళలు.. ప్రియుడిని విడిచి ఉండలేక.. అడ్డుగా ఉన్న భర్తనే లేకుండా చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి మరో ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది… ప్రియుడు మోజులో పడిపోయిన ఓ వివాహిత.. భర్తను హత్య చేయించింది.. ప్రియురాలి కోసం ఐదు లక్షల రూపాయులు సుపారీ ఇచ్చి.. ఆమె భర్తను హత్య చేయించాడు ప్రియుడు.. ఏదైనా.. దొంగతనం, వివాహేతర సంబంధాలు ఎక్కువ కాలం గుట్టుగా సాగవు అంటారు కదా.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
Read Also: Ambati Rambabu Counter attack: హరీష్రావుపై అంబటి కౌంటర్ ఎటాక్.. చర్చకు సిద్ధమా..?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 25వ తేదీన గేరిగేచినేపల్లి గ్రామానికి చెందిన హరీష్ కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.. తన భర్త కనిపించకుండా పోయాడంటూ అతని భార్య స్నేహ పోలీసులను ఆశ్రయించింది.. అయితే, ఈ నెల 28వ తేదీన గణేష్ పురం అటవీ ప్రాంతంలో హరీష్ కుమార్ మృతదేహం లభించింది… దీనిపై ఆరా తీసిన పోలీసులు అసలు రహస్యాన్ని బయటపెట్టారు.. సతీష్ కుమార్ భార్య స్నేహకు, టేకుమాను తాండా గ్రామానికి చెందిన సతీష్ నాయక్ తో పరిచయం ఏర్పడకింది.. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.. ఇక, తమ సంబంధానికి భర్త సతీష్ కుమార్ అడ్డు వస్తున్నాడని.. అతడిని అడ్డుతొలగించుకోవాలని ఈ అనైతిక సంబంధం నెరుపుతోన్న జంట ప్లాన్ చేసింది.. ప్రియురాలి కోసం వీర్నమల తాండ గ్రామానికి చెందిన నలుగురికి 5 లక్షల రూపాయలు సుఫారీ ఇస్తానని చెప్పి.. సతీష్ కుమార్ని హత్య చేయించాడు సతీష్ నాయక్.. మొత్తగా సతీష్ కుమార్ మృతదేహం లభ్యం కావడం.. అతని భార్య ఫిర్యాదుతో అనుమానం వచ్చిన పోలీసులు.. దర్యాప్తు జరపగా.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు… ఈ హత్య వ్యవహారం వెలుగు చూసింది.. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు, రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!