Kuppam Crime: అనైతిక బంధం.. రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. అడ్డుగా ఉన్న భర్తల ప్రాణాలు తీసిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి… కుటుంబం కోసం సంపాదనతో భర్త బిజీగా ఉంటే… మరో వ్యక్తితో రంకు నడుపుతోన్న కొందరు ముదురు మహిళలు.. ప్రియుడిని విడిచి ఉండలేక.. అడ్డుగా ఉన్న భర్తనే లేకుండా చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి మరో ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది… ప్రియుడు మోజులో పడిపోయిన ఓ వివాహిత.. భర్తను హత్య చేయించింది.. ప్రియురాలి కోసం ఐదు లక్షల రూపాయులు సుపారీ ఇచ్చి.. ఆమె భర్తను హత్య చేయించాడు ప్రియుడు.. ఏదైనా.. దొంగతనం, వివాహేతర సంబంధాలు ఎక్కువ కాలం గుట్టుగా సాగవు అంటారు కదా.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
Read Also: Ambati Rambabu Counter attack: హరీష్రావుపై అంబటి కౌంటర్ ఎటాక్.. చర్చకు సిద్ధమా..?
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 25వ తేదీన గేరిగేచినేపల్లి గ్రామానికి చెందిన హరీష్ కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.. తన భర్త కనిపించకుండా పోయాడంటూ అతని భార్య స్నేహ పోలీసులను ఆశ్రయించింది.. అయితే, ఈ నెల 28వ తేదీన గణేష్ పురం అటవీ ప్రాంతంలో హరీష్ కుమార్ మృతదేహం లభించింది… దీనిపై ఆరా తీసిన పోలీసులు అసలు రహస్యాన్ని బయటపెట్టారు.. సతీష్ కుమార్ భార్య స్నేహకు, టేకుమాను తాండా గ్రామానికి చెందిన సతీష్ నాయక్ తో పరిచయం ఏర్పడకింది.. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.. ఇక, తమ సంబంధానికి భర్త సతీష్ కుమార్ అడ్డు వస్తున్నాడని.. అతడిని అడ్డుతొలగించుకోవాలని ఈ అనైతిక సంబంధం నెరుపుతోన్న జంట ప్లాన్ చేసింది.. ప్రియురాలి కోసం వీర్నమల తాండ గ్రామానికి చెందిన నలుగురికి 5 లక్షల రూపాయలు సుఫారీ ఇస్తానని చెప్పి.. సతీష్ కుమార్ని హత్య చేయించాడు సతీష్ నాయక్.. మొత్తగా సతీష్ కుమార్ మృతదేహం లభ్యం కావడం.. అతని భార్య ఫిర్యాదుతో అనుమానం వచ్చిన పోలీసులు.. దర్యాప్తు జరపగా.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు… ఈ హత్య వ్యవహారం వెలుగు చూసింది.. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు, రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!