Kuppam Crime: అనైతిక బంధం.. రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. అడ్డుగా ఉన్న భర్తల ప్రాణాలు తీసిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి… కుటుంబం కోసం సంపాదనతో భర్త బిజీగా ఉంటే… మరో వ్యక్తితో రంకు నడుపుతోన్న కొందరు ముదురు మహిళలు.. ప్రియుడిని విడిచి ఉండలేక.. అడ్డుగా ఉన్న భర్తనే లేకుండా చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి మరో ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది… ప్రియుడు మోజులో పడిపోయిన ఓ వివాహిత.. భర్తను హత్య చేయించింది.. ప్రియురాలి కోసం ఐదు లక్షల రూపాయులు సుపారీ ఇచ్చి.. ఆమె భర్తను హత్య చేయించాడు ప్రియుడు.. ఏదైనా.. దొంగతనం, వివాహేతర సంబంధాలు ఎక్కువ కాలం గుట్టుగా సాగవు అంటారు కదా.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
Read Also: Ambati Rambabu Counter attack: హరీష్రావుపై అంబటి కౌంటర్ ఎటాక్.. చర్చకు సిద్ధమా..?
Also Read
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 25వ తేదీన గేరిగేచినేపల్లి గ్రామానికి చెందిన హరీష్ కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.. తన భర్త కనిపించకుండా పోయాడంటూ అతని భార్య స్నేహ పోలీసులను ఆశ్రయించింది.. అయితే, ఈ నెల 28వ తేదీన గణేష్ పురం అటవీ ప్రాంతంలో హరీష్ కుమార్ మృతదేహం లభించింది… దీనిపై ఆరా తీసిన పోలీసులు అసలు రహస్యాన్ని బయటపెట్టారు.. సతీష్ కుమార్ భార్య స్నేహకు, టేకుమాను తాండా గ్రామానికి చెందిన సతీష్ నాయక్ తో పరిచయం ఏర్పడకింది.. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.. ఇక, తమ సంబంధానికి భర్త సతీష్ కుమార్ అడ్డు వస్తున్నాడని.. అతడిని అడ్డుతొలగించుకోవాలని ఈ అనైతిక సంబంధం నెరుపుతోన్న జంట ప్లాన్ చేసింది.. ప్రియురాలి కోసం వీర్నమల తాండ గ్రామానికి చెందిన నలుగురికి 5 లక్షల రూపాయలు సుఫారీ ఇస్తానని చెప్పి.. సతీష్ కుమార్ని హత్య చేయించాడు సతీష్ నాయక్.. మొత్తగా సతీష్ కుమార్ మృతదేహం లభ్యం కావడం.. అతని భార్య ఫిర్యాదుతో అనుమానం వచ్చిన పోలీసులు.. దర్యాప్తు జరపగా.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు… ఈ హత్య వ్యవహారం వెలుగు చూసింది.. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు, రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!