Minister Satya Kumar Yadav: హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు.. తప్పు చేసింది ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు..!
- తిరుమల లడ్డూ వ్యవహారంలో మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్..
- తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. వైఎస్ జగన్ మొదటి నుండి తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తువచ్చారని ఆరోపించారు.. ఒక్క తిరుపతినే కాదు, హిందూ సంప్రదాయంపైన కూడ జగన్ దాడులు చేశాడని మండిపడ్డారు.. తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని NDBB సంస్థ కూడా చెప్పిందని గుర్తు చేశారు.. ఇక, న్యాయవాది పొన్నవోలు పంది కొవ్వుని బంగారంతో పోల్చటం దేవుడిని అపహాస్యం చేసినట్లే అని మండిపడ్డారు.. పంది కొవ్వుని బంగారంతో పోల్చిన పొన్నవోలు మాటలు అర్థరహితమన్నారు..
Read Also: Tamil Nadu Governor: ‘‘సెక్యులరిజం’’తో భారత్కి ఏం సంబంధం.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ఇక, తిరుపతిలో జరిగిన ఘటన హిందువల మనోభావాలను దెబ్బ తీసిందన్నారు మంత్రి సత్యకుమార్.. తిరుమల పుణ్య క్షేత్రం పై భక్తి ఉంటే ఆస్తులను వేలం వేసేవారు కాదు అన్నారు.. వైసీపీ నాయకులు తిరుమలపైనే.. ఆలయ పవిత్ర తగ్గేలా ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.. అయితే, తప్పులు చేసినవారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు నుండి గాంధీ జయంతి వరకు ఏక్ పేడ్ మా కే నామ్ (Ek ped Maa Ke Naam) తల్లికి ఒక మొక్క అనే కార్యక్రమం ఉద్దేశ్యంతో చేపట్టాం అన్నారు.. ప్రకృతి సమతుల్యంగా ఉండాలని ప్రతి విద్యార్థికి అవగాహన తెలియజేసేలా ఈ కార్యక్రమం ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.. అందుకే ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని పిలుపునిస్తున్నాం.. వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం అని వెల్లడించారు.. రక్తదానం చేసేందుకు ప్రతి విద్యార్థి, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.. రక్తదానం ఎంత ముఖ్యమో.. దానిపైన అవగాహన కూడా కల్పిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!