Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ – టుడేస్ వర్క్షాప్’లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యాలు చేశారు.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సంస్కరణాత్మక కార్యక్రమాలు చేపట్టామని, వివిధ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ’ వర్క్షాప్ పోలీసు వ్యవస్థకు ఎంతో కీలకమని ఆమె అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను 4 శాతం మేర తగ్గించగలిగామని హోంమంత్రి వెల్లడించారు. అలాగే గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. జిల్లా ఎస్పీలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో గంజాయి సాగుపై సమర్థవంతంగా నియంత్రణ సాధించామని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకుడని పేర్కొన్న అనిత.. 2028 నాటికి ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుంటారని అన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి అభిప్రాయాలను వినే నాయకత్వం ఆయనదని కొనియాడారు. తన రాజకీయ జీవితంలో అనేక మంది పోలీసు అధికారులతో కలిసి పనిచేసిన అనుభవం సీఎం చంద్రబాబుకు ఉందని తెలిపారు.
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
సైబర్ నేరాలు ప్రస్తుతం పెద్ద సవాలుగా మారాయని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి అవసరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పోలీసులు చేసే దర్యాప్తు కంటే కొన్ని సందర్భాల్లో ప్రజలు సోషల్ మీడియాలో చేసే చర్చలు, విచారణలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహితంగా పోస్టులు చేయడం, అసత్య ప్రచారం చేయడం వంటి అంశాలపై పోలీసులు మరింత దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రంలో నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ రెండు రోజుల వర్క్షాప్లో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని తెలిపారు. వర్క్షాప్లో పాల్గొంటున్న అధికారులు తమ సలహాలు, సూచనలను నేరుగా ముఖ్యమంత్రికి అందించాలని హోంమంత్రి అనిత కోరారు. దీంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!