Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ – టుడేస్ వర్క్షాప్’లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యాలు చేశారు.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సంస్కరణాత్మక కార్యక్రమాలు చేపట్టామని, వివిధ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ’ వర్క్షాప్ పోలీసు వ్యవస్థకు ఎంతో కీలకమని ఆమె అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను 4 శాతం మేర తగ్గించగలిగామని హోంమంత్రి వెల్లడించారు. అలాగే గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. జిల్లా ఎస్పీలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో గంజాయి సాగుపై సమర్థవంతంగా నియంత్రణ సాధించామని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకుడని పేర్కొన్న అనిత.. 2028 నాటికి ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుంటారని అన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి అభిప్రాయాలను వినే నాయకత్వం ఆయనదని కొనియాడారు. తన రాజకీయ జీవితంలో అనేక మంది పోలీసు అధికారులతో కలిసి పనిచేసిన అనుభవం సీఎం చంద్రబాబుకు ఉందని తెలిపారు.
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
సైబర్ నేరాలు ప్రస్తుతం పెద్ద సవాలుగా మారాయని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి అవసరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పోలీసులు చేసే దర్యాప్తు కంటే కొన్ని సందర్భాల్లో ప్రజలు సోషల్ మీడియాలో చేసే చర్చలు, విచారణలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహితంగా పోస్టులు చేయడం, అసత్య ప్రచారం చేయడం వంటి అంశాలపై పోలీసులు మరింత దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రంలో నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ రెండు రోజుల వర్క్షాప్లో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని తెలిపారు. వర్క్షాప్లో పాల్గొంటున్న అధికారులు తమ సలహాలు, సూచనలను నేరుగా ముఖ్యమంత్రికి అందించాలని హోంమంత్రి అనిత కోరారు. దీంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!