Ajinkya Rahane: రూమ్కు రూల్.. ఎంఎస్ ధోనీ తలుపు మూసి ఉంటే అంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి భారత మాజీ బ్యాటర్ అజింక్య రహానే ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ధోనీ ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తి అని, జట్టులోని ప్రతి ఆటగాడితో స్నేహపూర్వకంగా ఉండేవాడని చెప్పాడు. అయితే ధోనీ గదికి సంబంధించిన ఓ ప్రత్యేక నియమం ఉండేదని వెల్లడించాడు. తలుపు తెరిచి ఉంటే ఎవరైనా వెళ్లొచ్చని, కానీ తలుపు మూసి ఉంటే మాత్రం ఎవరూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసేవారు కాదని జింక్స్ వెల్లడించాడు.
అజింక్య రహానే గత వారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టీ20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లలోనూ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోనే అతడు అరంగేట్రం చేశాడు. అలాగే 2023, 2024 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నాడు. తాజాగా ఓ క్రికెట్ పోడ్కాస్ట్లో మాట్లాడిన రహానే.. ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ‘ధోనీ చాలా ప్రశాంతంగా, కూల్గా ఉంటాడు. అందరిలాగే సాధారణ వ్యక్తి. అతని గది దాదాపు ఎప్పుడూ తెరిచే ఉండేది. జట్టులోని ఎవరైనా వెళ్లి మాట్లాడొచ్చు, సమయం గడపొచ్చు. చాలాసార్లు 10 నుంచి 15 మంది ఆటగాళ్లు, కొన్నిసార్లు మొత్తం జట్టే అతని గదిలో ఉండేది. కానీ ఒకసారి తలుపు మూసి ఉంటే మాత్రం ఎవరూ లోపలికి వెళ్లేవారు కాదు. మహీని మేము అలా గౌరవించే వాళ్లం’ అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
సోషల్ మీడియా వినియోగంపై కూడా అజింక్య రహానే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘సిరీస్ జరుగుతున్న సమయంలో నేను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటా. మ్యాచ్ల సమయంలో సోషల్ మీడియా యాప్లన్నింటినీ మొబైల్ నుంచి తొలగిస్తా. ఇది ఎవరూ చెప్పిన సలహా కాదు, నేనే స్వయంగా అలవాటు చేసుకున్నా. ఈ అలవాటుకు ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ ఇచ్చిన సలహా కూడా కారణం. 2017లో ఐపీఎల్లో కలిసి ఆడుతున్న సమయంలో సోషల్ మీడియాను పట్టించుకోవద్దని స్టోక్స్ సూచించాడు. అప్పటి నుంచి నాకు ఒక ప్రత్యేక దినచర్య ఏర్పడింది. ఖాళీ సమయంలో నెట్ఫ్లిక్స్లో సినిమాలు లేదా వెబ్ సిరీస్లు చూడడం, పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, మరుసటి రోజు కోసం దుస్తులు సిద్ధం చేసుకోవడం వంటి పనులు నన్ను మానసికంగా ప్రశాంతంగా ఉంచాయి’ అని చెప్పాడు.
దాదాపు రెండు దశాబ్దాల అంతర్జాతీయ కెరీర్కు ఇటీవల వీడ్కోలు పలికిన అజింక్య రహానే.. భారత జట్టు తరఫున 85 టెస్టులు ఆడి 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే 90 వన్డేల్లో 2,962 పరుగులు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 375 పరుగులు చేసి భారత క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!