Minister Satya Kumar Yadav: హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు.. తప్పు చేసింది ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు..!
- తిరుమల లడ్డూ వ్యవహారంలో మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్..
- తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. వైఎస్ జగన్ మొదటి నుండి తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తువచ్చారని ఆరోపించారు.. ఒక్క తిరుపతినే కాదు, హిందూ సంప్రదాయంపైన కూడ జగన్ దాడులు చేశాడని మండిపడ్డారు.. తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని NDBB సంస్థ కూడా చెప్పిందని గుర్తు చేశారు.. ఇక, న్యాయవాది పొన్నవోలు పంది కొవ్వుని బంగారంతో పోల్చటం దేవుడిని అపహాస్యం చేసినట్లే అని మండిపడ్డారు.. పంది కొవ్వుని బంగారంతో పోల్చిన పొన్నవోలు మాటలు అర్థరహితమన్నారు..
Read Also: Tamil Nadu Governor: ‘‘సెక్యులరిజం’’తో భారత్కి ఏం సంబంధం.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఇక, తిరుపతిలో జరిగిన ఘటన హిందువల మనోభావాలను దెబ్బ తీసిందన్నారు మంత్రి సత్యకుమార్.. తిరుమల పుణ్య క్షేత్రం పై భక్తి ఉంటే ఆస్తులను వేలం వేసేవారు కాదు అన్నారు.. వైసీపీ నాయకులు తిరుమలపైనే.. ఆలయ పవిత్ర తగ్గేలా ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.. అయితే, తప్పులు చేసినవారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు నుండి గాంధీ జయంతి వరకు ఏక్ పేడ్ మా కే నామ్ (Ek ped Maa Ke Naam) తల్లికి ఒక మొక్క అనే కార్యక్రమం ఉద్దేశ్యంతో చేపట్టాం అన్నారు.. ప్రకృతి సమతుల్యంగా ఉండాలని ప్రతి విద్యార్థికి అవగాహన తెలియజేసేలా ఈ కార్యక్రమం ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.. అందుకే ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని పిలుపునిస్తున్నాం.. వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం అని వెల్లడించారు.. రక్తదానం చేసేందుకు ప్రతి విద్యార్థి, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.. రక్తదానం ఎంత ముఖ్యమో.. దానిపైన అవగాహన కూడా కల్పిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..