Minister Satya Kumar Yadav: హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు.. తప్పు చేసింది ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు..!
- తిరుమల లడ్డూ వ్యవహారంలో మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్..
- తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. వైఎస్ జగన్ మొదటి నుండి తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తువచ్చారని ఆరోపించారు.. ఒక్క తిరుపతినే కాదు, హిందూ సంప్రదాయంపైన కూడ జగన్ దాడులు చేశాడని మండిపడ్డారు.. తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని NDBB సంస్థ కూడా చెప్పిందని గుర్తు చేశారు.. ఇక, న్యాయవాది పొన్నవోలు పంది కొవ్వుని బంగారంతో పోల్చటం దేవుడిని అపహాస్యం చేసినట్లే అని మండిపడ్డారు.. పంది కొవ్వుని బంగారంతో పోల్చిన పొన్నవోలు మాటలు అర్థరహితమన్నారు..
Read Also: Tamil Nadu Governor: ‘‘సెక్యులరిజం’’తో భారత్కి ఏం సంబంధం.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
ఇక, తిరుపతిలో జరిగిన ఘటన హిందువల మనోభావాలను దెబ్బ తీసిందన్నారు మంత్రి సత్యకుమార్.. తిరుమల పుణ్య క్షేత్రం పై భక్తి ఉంటే ఆస్తులను వేలం వేసేవారు కాదు అన్నారు.. వైసీపీ నాయకులు తిరుమలపైనే.. ఆలయ పవిత్ర తగ్గేలా ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.. అయితే, తప్పులు చేసినవారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు నుండి గాంధీ జయంతి వరకు ఏక్ పేడ్ మా కే నామ్ (Ek ped Maa Ke Naam) తల్లికి ఒక మొక్క అనే కార్యక్రమం ఉద్దేశ్యంతో చేపట్టాం అన్నారు.. ప్రకృతి సమతుల్యంగా ఉండాలని ప్రతి విద్యార్థికి అవగాహన తెలియజేసేలా ఈ కార్యక్రమం ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.. అందుకే ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని పిలుపునిస్తున్నాం.. వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం అని వెల్లడించారు.. రక్తదానం చేసేందుకు ప్రతి విద్యార్థి, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.. రక్తదానం ఎంత ముఖ్యమో.. దానిపైన అవగాహన కూడా కల్పిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!