Vangalapudi Anitha: టీడీపీ, వైసీపీ పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలి..
- గత ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతల ఎలా ఉన్నాయనేది అందరికీ తెలుసు..
- చంద్రబాబు సీఎం అయ్యాక సగం శాంతి భద్రతలు అదుపులోకి ఉన్నాట్లే..
- టీడీపీ- వైసీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు సంయమనం పాటించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కొన్ని అరాచక శక్తులు మా ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ప్రజలకు అందరికీ తెలుసు.. గత ఐదేళ్లలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు అని ఆమె చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలకే ఇబ్బందులు ఎదురయ్యాయి.. ప్రజలిచ్చిన మద్దతును ఓర్చుకోలేక పోతున్నారు.. రెండు పార్టీల వ్యక్తులకు అప్పీల్ చేస్తున్నా.. అనవసరంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు.. చట్టం ఎవరికైనా ఒక్కటే టీడీపీ, వైసీపీ నేతలు, పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలి అని ఏపీ హోంమంత్రి అనిత వేడుకున్నారు.
Read Also: UP: ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన 12 కోచ్లు!
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, కేంద్ర హోం మంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసు సహా వివిధ ఘటనలను కూడా ప్రస్తావించాలి అని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. గతం ప్రభుత్వ హాయంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది.. దేనికైనా సమయం వస్తుంది.. అన్ని అంశాలు చట్టపరంగా చర్యలు ఉంటాయి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటేనే సగం శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టే.. గతంలో దిశా యాప్ ను మగవాళ్ళతోను డౌన్ లోడ్ చేయించారు.. అత్యాచార ఘటనల నియంత్రణకు పోలీసు, విద్యా శాఖలతో స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడించారు.
తాజావార్తలు
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?