Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిహార్లోని బకీంపూర్, మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఉపఎన్నికల ఓటములు భారతీయ జనతా పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలతను తెచ్చిపెట్టాయి. వరుసగా రెండు వారాల వ్యవధిలోనే పేపర్ లీకేజీ నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం, ఇప్పుడు సొంత పాలనలో ఉన్న రెండు కీలక రాష్ట్రాల ఉపఎన్నికల్లో ఓడిపోవడం పార్టీ నాయకత్వాన్ని ఆత్మపరిశీలనలో పడేసింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకే ఉపఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తుంటాయి. గుజరాత్లోని మంజల్పూర్లో భాజపా భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ.. బకీంపూర్, దతియా స్థానాల్లో ఎదురైన పరాభవం మాత్రం పార్టీ బలహీనతలను స్పష్టంగా ఎత్తిచూపుతోంది.
ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గతంలో ప్రాతినిధ్యం వహించిన, 50 వేలకు పైగా మెజారిటీ ఉన్న బీజేపీ దశాబ్దాల కోట బకీంపూర్లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ చేతిలో ఎదురైన ఓటమి అత్యంత నష్టదాయకంగా మారింది. ప్రశాంత్ కిశోర్ ఈ గెలుపుతో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టడమే కాకుండా.. బీజేపీ సాంప్రదాయ అగ్రవర్ణ ఓటు బ్యాంకులో స్పష్టమైన చీలిక తీసుకురాగలిగారు. ఆర్జేడీ తన కోర్ ఓట్లను కిశోర్కు బదిలీ చేయడం వల్లనే ఈ ఫలితం వచ్చిందని బీజేపీ ఆరోపిస్తున్నప్పటికీ.. నీట్ పేపర్ లీకేజీ నిరసనలు, యూజీసీ మార్గదర్శకాలు, పోలీస్ చర్యలపై యువత, విద్యార్థుల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తి ఓటింగ్ శాతం తగ్గడానికి, పార్టీ సాంప్రదాయ ఓటర్లు దూరమవ్వడానికి కారణమయ్యాయి. స్థానిక నేతలను మార్చడం, ఓటర్లను తక్కువగా అంచనా వేయడం కూడా ప్రతికూలంగా మారింది.
Also Read
- Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
- Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
మరోవైపు.. మధ్యప్రదేశ్లోని దతియా స్థానంలో కాంగ్రెస్ తన నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడంతో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వర్గానికి రాజకీయ ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. ఈ ఓటమికి టికెట్ దక్కక అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా వర్గ విభేదాలు, అభ్యర్థి ఎంపికలో జరిగిన పొరపాట్లే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్గత పోరు, విద్యార్థుల నిరసనలు, ఓటర్ల అసంతృప్తి కలిసికట్టుగా భాజపా సంప్రదాయ స్థానాలకు గండికొట్టాయి. ఈ ఓటములతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణంలో మున్ముందు కీలక మార్పులు చోటుచేసుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!