NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
- రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ ఆపరేషన్లు
- 90% శస్త్రచికిత్సలు పేదలకు ఉచితం
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో విస్తరించనున్న రొబోటిక్ సేవలు
- నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించిన సీఎం, మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIMS : హైదరాబాద్లోని నైజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం రెండున్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలసి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ వైద్యులను, నర్సింగ్ అధికారులను, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఉచితంగా 90 శాతానికి పైగా శస్త్రచికిత్సలు
నిమ్స్లో ఇప్పటివరకు నిర్వహించిన వెయ్యి రొబోటిక్ సర్జరీలలో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. అత్యంత ఖరీదైన ఈ రొబోటిక్ శస్త్రచికిత్సలలో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకాల ద్వారా పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందించడం విశేషం.
Also Read
- CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
- Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
- CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
- CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక రొబోటిక్ సేవలు
దక్షిణ భారతదేశ ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ నిర్వహించిన ఘనత నిమ్స్దేనని మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తుచేశారు. ఇటీవలే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు 1,000 రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరడం ప్రభుత్వ వైద్య సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం నిమ్స్తో పాటు ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజుల్లో గాంధీ, కొత్త ఉస్మానియా, నిర్మాణం పూర్తికావస్తున్న టిమ్స్ (TIMS) ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలను పేదలకు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలోనే 1,000 రొబోటిక్ ఆపరేషన్లు పూర్తి చేసిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్యుల బృందం, ఆపరేషన్ థియేటర్, నర్సింగ్ సిబ్బందికి సీఎం తన అభినందనలు తెలిపారు. వివిధ వైద్య విభాగాలు, అనస్థీషియా, నర్సింగ్ టీమ్స్ సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని నిమ్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. వైద్యరంగానికి పూర్తి సహకారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!