NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
- రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ ఆపరేషన్లు
- 90% శస్త్రచికిత్సలు పేదలకు ఉచితం
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో విస్తరించనున్న రొబోటిక్ సేవలు
- నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించిన సీఎం, మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIMS : హైదరాబాద్లోని నైజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం రెండున్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలసి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ వైద్యులను, నర్సింగ్ అధికారులను, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఉచితంగా 90 శాతానికి పైగా శస్త్రచికిత్సలు
నిమ్స్లో ఇప్పటివరకు నిర్వహించిన వెయ్యి రొబోటిక్ సర్జరీలలో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. అత్యంత ఖరీదైన ఈ రొబోటిక్ శస్త్రచికిత్సలలో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకాల ద్వారా పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందించడం విశేషం.
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక రొబోటిక్ సేవలు
దక్షిణ భారతదేశ ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ నిర్వహించిన ఘనత నిమ్స్దేనని మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తుచేశారు. ఇటీవలే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు 1,000 రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరడం ప్రభుత్వ వైద్య సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం నిమ్స్తో పాటు ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజుల్లో గాంధీ, కొత్త ఉస్మానియా, నిర్మాణం పూర్తికావస్తున్న టిమ్స్ (TIMS) ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలను పేదలకు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలోనే 1,000 రొబోటిక్ ఆపరేషన్లు పూర్తి చేసిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్యుల బృందం, ఆపరేషన్ థియేటర్, నర్సింగ్ సిబ్బందికి సీఎం తన అభినందనలు తెలిపారు. వివిధ వైద్య విభాగాలు, అనస్థీషియా, నర్సింగ్ టీమ్స్ సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని నిమ్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. వైద్యరంగానికి పూర్తి సహకారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!