MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy Gives Clarity On AP Early Elections: ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న ప్రచారానికి తాజాగా రాజంపేట ఎంపీ మిథన్ రెడ్డి చెక్ పెట్టారు. తాము లోక్సభ ఎన్నికల షెడ్యూల్తోనే ఎన్నికలకు వెళతామని క్లారిటీ ఇస్తూ.. ముందస్తు ఎన్నికల ఉండవని పరోక్షంగా చెప్పేశారు. పార్లమెంట్, అసెంబ్లీ కలిపి ఎన్నికలు జరిగితేనే అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చారు. ఆదివారం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తమ వైసీపీలోకి వస్తానంటే, తప్పకుండా స్వాగతిస్తామని తెలిపారు. అయితే.. ముద్రగడ పైన సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లే వారికే.. ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇస్తామన్నారు. వారే తమ పార్టీ అభ్యర్థులని కూడా తేల్చి చెప్పారు. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన.. ప్రజలతో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని చెప్పారు. అందుకే.. తమ వల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని పేర్కొన్నారు.
Etala Rajender: పార్టీలు మారడం అంటే.. బట్టలు మార్చినంత ఈజీ కాదు..!
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీతో పొత్తు ఆశయంలో భాగంగానే.. పవన్ మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చాలన్నదే పవన్ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి కానని పవన్ గతంలోనే చెప్పారని, తనకు సీఎం అయ్యేంత బలం లేదని స్వయంగా పవనే చెప్పారని గుర్తు చేశారు. అందుకే.. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో పవన్ పని చేస్తున్నారన్నారు. అభిమానులు, ప్రజలను రెచ్చగొట్టి, లబ్ది పొందాలని పవన్ చూస్తున్నారని ఆరోపించారు. జనసేన పార్టీ మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!