MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy Gives Clarity On AP Early Elections: ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న ప్రచారానికి తాజాగా రాజంపేట ఎంపీ మిథన్ రెడ్డి చెక్ పెట్టారు. తాము లోక్సభ ఎన్నికల షెడ్యూల్తోనే ఎన్నికలకు వెళతామని క్లారిటీ ఇస్తూ.. ముందస్తు ఎన్నికల ఉండవని పరోక్షంగా చెప్పేశారు. పార్లమెంట్, అసెంబ్లీ కలిపి ఎన్నికలు జరిగితేనే అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చారు. ఆదివారం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తమ వైసీపీలోకి వస్తానంటే, తప్పకుండా స్వాగతిస్తామని తెలిపారు. అయితే.. ముద్రగడ పైన సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లే వారికే.. ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇస్తామన్నారు. వారే తమ పార్టీ అభ్యర్థులని కూడా తేల్చి చెప్పారు. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన.. ప్రజలతో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని చెప్పారు. అందుకే.. తమ వల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని పేర్కొన్నారు.
Etala Rajender: పార్టీలు మారడం అంటే.. బట్టలు మార్చినంత ఈజీ కాదు..!
Also Read
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీతో పొత్తు ఆశయంలో భాగంగానే.. పవన్ మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చాలన్నదే పవన్ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి కానని పవన్ గతంలోనే చెప్పారని, తనకు సీఎం అయ్యేంత బలం లేదని స్వయంగా పవనే చెప్పారని గుర్తు చేశారు. అందుకే.. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో పవన్ పని చేస్తున్నారన్నారు. అభిమానులు, ప్రజలను రెచ్చగొట్టి, లబ్ది పొందాలని పవన్ చూస్తున్నారని ఆరోపించారు. జనసేన పార్టీ మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!