MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం
MP Mithun Reddy Gives Clarity On AP Early Elections: ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న ప్రచారానికి తాజాగా రాజంపేట ఎంపీ మిథన్ రెడ్డి చెక్ పెట్టారు. తాము లోక్సభ ఎన్నికల షెడ్యూల్తోనే ఎన్నికలకు వెళతామని క్లారిటీ ఇస్తూ.. ముందస్తు ఎన్నికల ఉండవని పరోక్షంగా చెప్పేశారు. పార్లమెంట్, అసెంబ్లీ కలిపి ఎన్నికలు జరిగితేనే అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చారు. ఆదివారం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తమ వైసీపీలోకి వస్తానంటే, తప్పకుండా స్వాగతిస్తామని తెలిపారు. అయితే.. ముద్రగడ పైన సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లే వారికే.. ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇస్తామన్నారు. వారే తమ పార్టీ అభ్యర్థులని కూడా తేల్చి చెప్పారు. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన.. ప్రజలతో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని చెప్పారు. అందుకే.. తమ వల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని పేర్కొన్నారు.
Etala Rajender: పార్టీలు మారడం అంటే.. బట్టలు మార్చినంత ఈజీ కాదు..!
Also Read
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీతో పొత్తు ఆశయంలో భాగంగానే.. పవన్ మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చాలన్నదే పవన్ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి కానని పవన్ గతంలోనే చెప్పారని, తనకు సీఎం అయ్యేంత బలం లేదని స్వయంగా పవనే చెప్పారని గుర్తు చేశారు. అందుకే.. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో పవన్ పని చేస్తున్నారన్నారు. అభిమానులు, ప్రజలను రెచ్చగొట్టి, లబ్ది పొందాలని పవన్ చూస్తున్నారని ఆరోపించారు. జనసేన పార్టీ మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!